మా ఆదాయం కొల్లగొడుతున్నారు – సీఎంకు తెలంగాణ దేవుళ్ళ మొర !

👉ప్రభుత్వం మారినా. మారని దోపిడి విధానం !

👉మాకు నాసిరకం నైవేద్యం భక్తులకు నాణ్యతలేని ప్రసాదాలు!

👉దోపిడి అరికట్టండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న  దేవుళ్ళు !

J.SURENDER KUMAR,

తెలంగాణ సీఎం గారు,  సాలినా కోట్లాది రూపాయల మా ఆదాయాన్ని  వారు కొల్లగొడుతున్నారు అని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల దేవుళ్ళ మొరపెట్టుకుంటున్నారు.

ఆన్లైన్ టెండర్ విధానం అడ్డుపెట్టుకొని, కొందరు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, కార్య నిర్వహణాధికారులు, గత పది సంవత్సరాలుగా మా ఆదాయాన్ని అందినంత గా ఆరగిస్తున్నారని దేవుళ్ళు ఆవేదన చెందుతున్నారు. 

‘ కారు ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా ‘  అధికారులు మాత్రం, మా ఆదాయ దోపిడి విధానంలో మాత్రం గత ప్రభుత్వ విధానం ను  కొనసాగిస్తు అందినంత దండుకుంటున్నారని దేవత మూర్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సరుకుల కొనుగోలు ఆన్లైన్ టెండర్ విధానంతో నిత్యం మాకు నాసిరకం సరుకులతో నైవేద్యాలు ఆరగించే దౌర్భాగ్యం, భక్తజనంకు నాణ్యత ప్రమాణాలు లేని ప్రసాదాలు తినే దురదృష్టం వెంటాడుతున్నదని దేవత మూర్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

సరుకుల కొనుగోలులో ఆన్లైన్ టెండర్ విధానంలొ మార్పులు చేర్పులు చేయాలని తెలంగాణ దేవుళ్ళ ఆవేదన, మౌనరోధనా ఇది.


👉దేవుళ్ళ మొరకు కారణం ఇది..


ఉమ్మడి రాష్ట్ర నివేదికలు అడ్డుపెట్టుకొని…
రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల ఆదాయం కొందరు అధికారుల పాలిట నైవేద్యంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. సాధించుకున్న స్వరాష్ట్రంలో  ఆలయాల కోసం సరుకుల కొనుగోలుకు ప్రత్యేక జీవో లేకున్నా, ఉమ్మడి రాష్ట్రంలో అధికారుల నివేదికల ఆధారంగా జారీ అయినా  సర్కులర్ ద్వారానే  కొనుగోలు చేస్తున్నారు, రాష్ట్రం ఏర్పడిన 46 రోజులలో దేవదాయ శాఖ  జారీ చేసిన సర్కులర్ ద్వారా గత పది సంవత్సరాల తరబడిగా ఆన్లైన్ టెండర్ నిబంధనలు అడ్డుపెట్టుకొని సరుకులకు అడ్డగోలుగా, అధిక ధరలు చెల్లిస్తూ కొందరు అధికారులు కొనుగోలు చేస్తూ, ఆలయాల ఆదాయంకు గండి కొడుతున్నారనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.
👉రాష్ట్ర ఏర్పాటైన 46 రోజులకే సర్కులర్!


దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి రాష్ట్ర ఏర్పడిన 46 రోజులకే సరుకుల కొనుగోలు విధి విధానాలపై  2014, జులై 18 న, సర్కులర్ నెంబర్ అర్, సి.No. E 2/10825/2014. జారీ చేశారు.


👉ఉమ్మడి రాష్ట్రా సర్కులర్..


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ శాఖ నివేదిక No.11(C.No.1104/ V&E/D4/10). తేదీ 30-1-2013 నాటి నివేదిక ఆధారంగా, దేవాదాయ శాఖ లేఖ సంఖ్య. ఆర్.సి.No,A4/37487/2013, తేదీ 31-12-2 013న జారీ చేసిన నియమ నిబంధనలో మేరకు సరుకులు కొనుగోలు చేయాలని ఆలయాల కార్య నిర్వహణాధికారు లకు ఆదేశాలు జారీ చేశారు.


👉వ్యాపారులకు షాక్ ఇస్తున్న నిబంధనలు!

ప్రముఖ పట్టణాలలో, జిల్లా కేంద్రాల్లో, కిరాణం హోల్ సేల్ వ్యాపారస్తులకు టెండర్ లోని బంధనలు షాక్ ఇస్తున్నట్టు సమాచారం. ఆ నిబంధనలు హైదరాబాదులోని రెండు, మూడు వ్యాపార సంస్థలకు ఉన్నట్టుగా, గత కొన్ని సంవత్సరాలుగా వారే టెండర్ లో పాల్గొంటూ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు సరుకులు సప్లై చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం.


👉సరుకుల సప్లై కి ఒక్కడే టెండర్ దారుడు !


ఆలయాలలో స్వామివారికి నిత్య నివేదన,  ప్రసాదాల తయారీ, అన్నదానం, పూజాది కార్యక్రమాల పూజా సామాగ్రి, పారిశుద్ధ్య నిర్వహణ  కెమికల్స్, బ్లీచింగ్ పౌడర్ లాంటివి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసే ఆకు దొప్పలు, విస్తరి ఆకులు, స్వామివారికి మామిడి తోరణాలు కట్టే  సుత్తిలి దారం, మొదలుకొని విద్యుత్తు వైర్లు, బల్బులు, పరికరాలు, సప్లై కోసం టెండర్ లలో అధికారులు ఆలయాల అవసరాల మేరకు సప్లై లో దాదాపు 100 అంశాల వివరాలు పేర్కొంటున్నారు అని సమాచారం.
సంవత్సర కాలానికి సరుకులు సప్లై చేసే టెండర్ సొంతం చేసుకున్న వ్యాపారుడి , వ్యాపార సంస్థ పేరు, ఒప్పందం జరిగిన సరుకుల ధరలు, సరుకుల నమూనా ( శాంపిల్స్) సమాచారం (సంవత్సర కాలం పాటు టెండర్ ఒప్పందం మేరకు పేర్కొన్న  నాణ్యత ప్రమాణాలు. గల  సరుకుల సప్లై చేస్తానంటూ. టెండర్ పొందిన వ్యాపారి, ఆలయంలో తనిఖీల కోసం. ఇచ్చే నిలువ ( ప్యాకెట్లు)  ఆలయాల పాలకవర్గానికి గాని, అర్చకులకు, (పాలకవర్గం లేని చోటు) ఉద్యోగులకు వాటి సమాచార వివరాలు తెలియకుండానే  ఆలయ అధికారుల సరుకుల కొనుగోలు తతంగం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు విమర్శలు ఉన్నాయి.


👉( ప్రముఖ బాసర ఆలయంలో ఆదివారం దేవాదాయ విజిలెన్స్ అధికారులు బృందం తనిఖీలు వెలుగు చూసిన అవకతవకలే ఆలయాల ఆదాయం గండికి నిదర్శనం )


👉మరో కథనంలో ఆదాయం గండి పడుతున్నది ఇలా..