👉నిధుల దోపిడీ కే టెండర్ నిబంధనలు రూపొందించారా ?
J.SURENDER KUMAR,
ప్రముఖ ఆలయాలలో ఆన్లైన్ టెండర్ పేరిట నిధులు అడ్డగోలు గా దోపిడి చేస్తున్నారు
కోట్లాది రూపాయల ఆలయ ఆదాయలు హారతి కర్పూరంలా ఆవిరి అవుతున్నాయి. ఆన్లైన్ టెండర్ అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు, వ్యాపార సంస్థ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. తెలంగాణ లో కొలువై ఉన్న దేవుళ్ళ ఆదాయం పట్ట పగలు, నిట్టనిలువు దోపిడికి గురి అవుతున్న, అడిగేవారు, అడ్డుకునేవారు లేరు. గత పది సంవత్సరాల తరబడి ఆన్లైన్ టెండర్ విధానం ముసుగులో కొనసాగుతున్న ఈ విధానం తీరుతున్నలను ప్రశ్నించే వారిని పచ్చ నోట్లతో ప్రసన్నం చేసుకుంటున్నారు. మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న, ఆన్లైన్ టెండర్ల ద్వారా సరుకులో కొనుగోలు విధానం రద్దు చేయాల్సిందిగా భక్తజనం ముక్తకంఠంతో కోరుతున్నారు.1
వివరాల్లోకి వెళితే!
రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన యాదాద్రి, భద్రాచలం, బాసర, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, భద్రకాళి తదితర మరికొన్ని ఆలయాలలో ఆన్లైన్ టెండర్ల ద్వారా సరుకులు కొనుగోలు గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్నది.
ఆయా ఆలయాల్లో కొలువై ఉన్న దేవుళ్లకు నిత్య నివేదన, భక్తులకు ప్రసాదాలు, స్వామి వారి ప్రసాదాల విక్రయం, ఉచిత అన్నదానం, తదితరాల అవసరాల నిమిత్తం, పంచదార, బియ్యం, నూనె, నెయ్యి, పప్పు ఉప్పు తదితర సరుకులు కొనుగోలు చేస్తుంటారు.
👉ఆర్థిక సంవత్సర కాలానికి సరుకులు
ధరల వివరాలు గోప్యం!
ఆలయానికి సరుకులను సప్లై చేసేవారు, ఆన్లైన్ టెండర్ ద్వారా ధరలను, కొట్ చేయాల్సి ఉంటుంది. వాటి వివరాలు ఆలయ ఈవోకు, టెండర్ దారుడికి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు.
(కొందరు అధికారులు, వ్యాపార సంస్థ లు రూపొందించిన టెండర్ నియమ నిబంధనలు ప్రకారం రాష్ట్రంలో కేవలం మూడు సంస్థలే టెండర్ లో పాల్గొనే అర్హతలు కలిగి ఉన్నారు అనే ఆరోపణలు ఉన్నాయి)
గత కొన్ని సంవత్సరాలుగా మూడు సంస్థలే ఆన్లైన్ టెండర్ లో పాల్గొనడం అందులో ఒకరు తక్కువ కోట్ చేసి సరుకుల సప్లై టెండర్ దక్కించుకోవడం మిగతా రెండు సంస్థలు వారి బినామీ సంస్థలు అనే ఆరోపణలు ఉన్నాయి. ( టెండర్ రికార్డులు పరిశీలిస్తే వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి )
👉 హోల్ సేల్ వ్యాపారులు ఆన్లైన్ టెండర్ పాల్గొనడానికి అర్హత లేని నిబంధనలు ఇలా….
ఈ ప్రొక్యూర్ మెంట్ లో నిబంధనలు !
👉టెండర్ దారుడు, ఫుడ్ గ్రేన్ వ్యాపారంలో రిజిస్టర్ అయి ఉండాలి,
👉కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి!
👉EMD, డబ్బులు. ₹ 15 లక్షల రూపాయలు ఆయా ఆలయ కార్యనిర్వహణాధికారి పేరిట నేషనల్ బ్యాంకులో డిడి తీయాలి.
👉 టెండర్ పొందినవారు సంవత్సర కాల పరిమితి ముగిసిన తరువాత EMD డబ్బులు తిరిగి పొందడానికి అవకాశం
👉టెండర్ షెడ్యూల్ ఫామ్ ధర ₹ 3000/-
👉బియ్యం, పంచదార, శనగపప్పు, ఖజు ,ఎండు ఖర్జూర, నూనెల తదితర వ్యాపారంలో సాలిన కనీసం ₹ 10 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు గత మూడు ఆర్థిక సంవత్సరాల కాలం పాటు కలిగి ఉండాలి.
👉గ్రేడ్ వన్ ఆలయాలనికి సాలీనా ₹ 5 కోట్లు, వ్యాపార లావాదేవీలు కలిగిన వారు అర్హులు,
👉 అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ,నుంచి డిప్యూటీ కమిషనర్ హోదా గల ఆలయాలకు ₹ 10 కోట్ల వ్యాపార లావాదేవీలు కలిగి ఉండాలి.
👉రీజినల్ జాయింట్ కమిషనర్ హోదా గల ఆలయాలకు ₹ 25 కోట్ల వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నవారే ఆయా ఆలయాల్లో టెండర్లు పాల్గొనడానికి అర్హతగా ప్రకటించారు.
👉₹ 5. ₹10, ₹ 25 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలకు సంబంధించి ప్రతి ఆర్థిక మూడు సంవత్సరములకు వాణిజ్య పనుల శాఖ జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని ( సర్టిఫికెట్ ) జతపరిచాల్సి ఉంటుంది.
👉మూడు సంవత్సరల కాల అనుభవం, సరఫరా సక్రమంగా చేస్తున్నాడంటూ ప్రభుత్వ సంస్థలచే ధ్రువీకరణ పత్రం తప్పనిసరి సమర్పించాల్సి ఉంటుంది.
👉సంస్థ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం, జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఇన్కమ్ టాక్స్ కాపీ, వ్యాపారంలో లాభనష్టాల ఆడిట్ నివేదిక,. మూడు ఆర్థిక సంవత్సర అమ్మకాలు, వ్యాపార లావాదేవీల, వివరాలు దానిపై కమర్షియల్ టాక్స్ అధికారి అట్టేస్టేషన్ చేయించి జతపరిచాల్సి ఉంటుంది.
👉ఆగా మార్క్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫుడ్ గ్రేన్ వ్యాపారం బియ్యం, పప్పులు, హోల్ సేల్ ఖజు, పల్లి గింజలు, ఆయిల్ గింజలు, FSSAI లైసెన్స్ సమర్పించాలి.
👉200 మెట్రిక్ టన్నుల, బియ్యం 100 మెట్రిక్ టన్నుల, శనగపప్పు 6 మెట్రిక్ టన్నుల ఖాజూ (రెండు పలుకులు గలది) 20 మెట్రిక్ టన్నులు, ఎండు ఖర్జూర పండ్లు, పలుకులు (రెండు పలుకులు కలిగి ఉన్నది) 2 మెట్రిక్ టన్నులు ,చింతపండు, 150. మెట్రిక్ టన్నులు ,పంచదార, 6 మెట్రిక్ టన్నులు, ఎండు ఖర్జూర, గత రెండు ఆర్థిక సంవత్సరాలలో సరఫరా చేసినట్టు చార్టెడ్ అకౌంటెంట్ ధ్రువీకరించిన పత్రం జతపరిచాల్సి ఉంటుంది.
👉ఆలయాలకు సరఫరా చేసే సామాగ్రి టెండర్ లో అర్హతలు నిబంధనలు (స్టాక్) తదితర నిబంధనల మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాకు. చెందిన ఏ ఒక్క వ్యాపారి గాని, వ్యాపార సంస్థ గాని టెండర్లు పాల్గొనే అర్హత లేనట్టు సమాచారం.
👉 హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ, తన మరో రెండు బినామీ సంస్థలతో ఆన్ లైన్ టెండర్ లో పాల్గొని కైవసం చేసుకుంటున్నారు అనేది జగమెరిగిన సత్యం. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయాలకు సరఫరా అవుతున్న సామాగ్రి అధిక ధరలు ఉండగా అవే సామాగ్రి మార్కెట్లో సగం ధరలకు అందుబాటులో ఉన్న వాటిని కొనుగోలు చేయకుండా సరఫరా చేసే సంస్థకు ఆలయాల అధికారులు అధిక ధరలు చెల్లిస్తున్నారు అనేది నిజం. సరుకుల వివరాలు, క్వాలిటీ, క్వాంటిటీ సంబంధిత ఆలయాల కార్యనిర్వాహణాధికారులకు, సరఫరా చేసే సంస్థకు మాత్రమే తెలుసని ధర్మకర్తలకు, ఉద్యోగులకు తెలిసే అవకాశం లేకుండా కొనసాగుతున్నట్టు ఈ దోపిడి బాగోతం కొనసాగుతున్నది.
👉ప్రతి నెల ₹ 5 లక్షల నుంచి ₹10 లక్షలకు పైగా ఆదాయానికి గండి!
ప్రత్యేకంగా దాదాపు 20 ప్రముఖ ఆలయాలు ప్రతినెల ప్రసాదాల సరుకుల కొనుగోలు లో.₹ 5 లక్షల నుండి 10 లక్షలకు పైగా ఒక్కొక్క ఆలయం సరుకుల కొనుగోలులో మార్కెట్ ధరల కన్నా అధిక ధరలు చెల్లిస్తూ ఆలయాల ఆదాయానికి గండి కొడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా కొన్ని ఆలయాల అధికారులు 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్లైన్ టెండర్ల ప్రకటనలు జారీ చేశారు, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 2025 వరకు ప్రముఖ ఆలయాలు టెండర్ వ్యాపార సంస్థకు అగ్రిమెంటు సైతం చేసుకున్నారు.
( మరో కథనంలో..టెండర్ కు జీవో లేదు. సర్కులర్ తోనే సరుకుల కొనుగోలు )