ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిపే వారే అంగన్వాడి కార్యకర్తలు !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి వారికి వివరిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లా విధులు నిర్వహిస్తున్న వారే. అంగన్వాడి కార్యకర్తలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి పట్టణం లోని నూతన గిరిజన బాలుర విద్యార్థి వసతి గృహంలో శనివారం అంగన్వాడీ టీచర్స్ రివైజ్డ్ ప్రీస్కూల్ ట్రైనింగ్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..


గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంగన్వాడి ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించినప్పుడు తాను సోదరుడిలా మీ వెంట ఉంటూ మీకు మద్దతు గా పోరాడిన విషయాన్ని ఎమ్మెల్యే వివరించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మీ న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మరియు సంబంధిత శాఖ మంత్రికి వివరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు.

త్వరలోనే అంగన్వాడి ఉద్యోగులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మీ సమస్యలను నేరుగా తెలుసుకుంటానని, గ్రామ గ్రామాన అంగన్వాడీ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అంగన్వాడి ఉద్యోగులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారులు, ఉద్యోగులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.