రేపటి నుండి  అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం !

👉తొలి బ్యాచ్ ఈరోజు కాశ్మీర్‌కు !

👉యాత్రికుల భద్రత కోసం లక్ష మంది సాయిధ బలగాలు  వైమానిక నిఘా.!

👉 బలగాల ఆధీనంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి, అమర్నాథ్ లోయ !

👉మంచు లింగం దర్శన రెండు దారులలో 125 ‘లంగర్లు’  (కమ్యూనిటీ కిచెన్‌లు)

👉జూన్ 27 నాటికి 3.50 లక్షల మంది రిజిస్ట్రేషన్ !

👉సీసీటీవీ  నిఘా నీడలో  రెప్పవాల్చని  పహార !

👉52 రోజుల యాత్ర ఆగస్టు 19 న ముగింపు..

J.SURENDER KUMAR,

జమ్మూ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో

శనివారం ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు భారత

ప్రభుత్వం భారీభద్రతా చర్యలు చేపట్టింది. 

శివ ఖోరీ పుణ్యక్షేత్రానికి యాత్రికులను కాలినడకన అనుమతించడం లేదు వారిని బస్సుల్లో  తరలించనున్నారు.  పోలీసు, CRPF, ITBP మరియు ఇతర పారా-మిలటరీ బలగాల నుండి లక్ష మందికి పైగా  భద్రతా సిబ్బంది  ఫూల్‌ ప్రూఫ్ భద్రత కోసం మోహరించాయి.

యాత్రాకుల శిబిరాల వద్ద తగినంత భద్రతా బలగాలను మోహరించడంతో పాటు,  వైమానిక నిఘా ,అవాంఛనీయ కార్యకలాపాలు మరియు అనుమానాస్పద అంశాలపై నిఘా ఉంచడానికి స్పాటర్లను మోహరించాలని అధికారులు నిర్ణయించారు.

సీసీటీవీ  నిఘా నీడలో..

భద్రతా చర్యల్లో భాగంగా ఖాజీగుండ్‌ నుంచి పహల్‌గాం, బల్తాల్‌ బేస్‌ క్యాంపుల వరకు ఉన్న జాతీయ రహదారి సీసీటీవీ నిఘాలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. “యాత్రకు సంబంధించిన అన్ని వాహనాల కదలికలు 24 గంటలపాటు భద్రతా దళాల పర్యవేక్షణలో కొనసాగుతాయి.

రేపటినుండి ( జూన్ 29న ) ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర యాత్రికుల మొదటి బ్యాచ్ శుక్రవారం ఇక్కడి నుంచి కాశ్మీర్‌కు ఫ్లాగ్ ఆఫ్ అవుతుంది. యాత్రికులు ఇప్పటికే జమ్మూలోని భగవతి నగర్, యాత్రి నివాస్‌కు చేరుకోవడం ప్రారంభించారు, అక్కడి నుండి వారు ఉత్తర కాశ్మీర్, బల్తాల్ మరియు దక్షిణ కాశ్మీర్, అనంతనాగ్ బేస్ క్యాంపులకు ఎస్కార్ట్ కన్వేలలో బయలుదేరుతారు.


👉 మొదటి బ్యాచ్ యాత్రికులు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు భగవతి నగర్ యాత్రి నివాస్ నుండి ఎస్కార్టెడ్ కాన్వాయ్‌లో లోయకు బయలుదేరి శనివారం ‘దర్శనం’ చూసుకోనున్నారని అధికారులు తెలిపారు.


👉 దాదాపు 300 కి.మీ పొడవైన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని  వందలాది మంది భద్రతా దళాలు ( CAPF )లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

👉 85 కి.మీ పొడవైన శ్రీనగర్ – బల్తాల్ బేస్ క్యాంప్ రోడ్డు మరియు ఖాజిగుండ్ – పహల్గాం బేస్ క్యాంప్ రోడ్‌ లో  CAPF  బలగాలు కాపలాగా ఉన్నాయి.


👉 శ్రీనగర్ – బల్తాల్ మార్గంలో గండేర్బల్ జిల్లాలోని మణిగం వద్ద, ఖాజిగుండ్ – పహల్గాం మార్గంలోని మీర్ బజార్ వద్ద మరో యాత్రా శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు.


👉 ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర కోసం ఇప్పటివరకు మొత్తం 3.50 లక్షల మంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.


👉 గుహ ( మంచు లింగం ) పుణ్యక్షేత్రానికి రెండు మార్గాల్లో 125 ‘లంగర్లు’  (కమ్యూనిటీ కిచెన్‌లు) ఏర్పాటు చేశారు.


👉 లంగర్లలో 7,000 మందికి పైగా సేవాదార్లు యాత్రికులకు సేవలు అందించనున్నారు.


👉పహల్గాం మరియు బల్తాల్ మార్గాలలో యాత్రికుల కోసం హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.


👉 ఈ సంవత్సరం, NDRF, SDRF, స్థానిక పోలీసులు, BSF మరియు CRPF నుండి 38 పర్వత రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచారు.


👉 ప్రతి సంవత్సరం విజయవంతమైన అమర్‌నాథ్ యాత్రకు స్థానిక పోర్టర్‌లు, పోనీవాలాలు మరియు మాన్యువల్ కార్మికులు ఎక్కువగా సహకరిస్తారు.


👉 నున్వాన్ ( పహల్గామ్ – మంచు లింగం పుణ్యక్షేత్రం ) సాంప్రదాయ మార్గం 48 కి.మీ పొడవు  బాల్టాల్ –  మంచు లింగం మార్గం 14 కి.మీ.


👉 సాంప్రదాయ నున్వాన్ (పహల్గాం- మంచు లింగం పుణ్యక్షేత్రం) మార్గాన్ని ఉపయోగించే యాత్రికులు మంచులింగ మందిరానికి చేరుకోవడానికి నాలుగు రోజులు పడుతుంది, 

👉 పొట్టి బాల్టాల్ – మంచి లింగ మార్గాన్ని ఉపయోగించే వారు ‘దర్శనం’ చేసుకొని అదే రోజు బేస్ క్యాంపుకు  వస్తారు.


👉 నాలుగు మిలిటెంట్ దాడులు మినహా..

2000, 2001, 2002 మరియు 2017లలో 45 మంది యాత్రికులు మరణించారు మరియు డజన్ల కొద్దీ ఇతరులు గాయపడ్డారు, 2000, 2001, 2002 మరియు 2017లలో నాలుగు మిలిటెంట్ దాడులను మినహాయించి, చాలా సంవత్సరాలుగా అమర్‌నాథ్ యాత్ర  ప్రశాంతంగా జరుగుతున్నది.

సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో మంచు లింగ మందిరం శనివారం నుంచి 52 రోజుల సుదీర్ఘ యాత్ర ( జూన్ 29న )ప్రారంభమై ఆగస్టు 19న రక్షా బంధన్ మరియు శ్రావణ పూర్ణిమ పండుగలతో ముగుస్తుంది.