సాగునీటి ప్రాజెక్టులకు సహాయం చేయండి మంత్రులకు ఎమ్మెల్యేలు వినతి!

J.SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గ పరిధిలో పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణం, నియోజకవర్గంలో ఇతర ప్రాజెక్టుల ఆధునీకరణ, ఇతర అభివృద్ధి పనులు గూర్చి మంత్రులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు వినతి పత్రాలు అందించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.


హైదరాబాదులో మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ను ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి మంత్రులకు వినతి పత్రాన్ని అందించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.


జగిత్యాల జిల్లాలోని 12,479 ఎకరాల ఆయకట్టుకు నీరందించే పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టాలని, అదే విధంగా 230 ఎకరాల ఆయకట్టుకు శాశ్వత నీటి వనరులు అందించే గొల్లపెల్లి మండలంలోని రంగదాముని పల్లె రిజర్వాయర్ ఆధునికీకరణ, మరియు 18 వందల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత నీటి వనరులు అందించే వెల్గటూర్ మండలంలోని జంగనాల ప్రాజెక్ట్ ఆధునికరణ, అదే విధంగా నియోజక వర్గంలో ఉన్న గోదావరి నది ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వం చేపట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

మంత్రి స్పందించి, ఆయా ప్రాజెక్ట్లకు సంబందించిన నివేదికలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇది ఇలా ఉండగా నియోజక వర్గంలో ఇతర అభివృద్ధి పనులకు విధులు కేటాయించాల్సిందిగా. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రం ఇచ్చారు. వినతుల పై మంత్రులుసానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తెలిపారు.