J.SURENDER KUMAR,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు.

శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు కోరుతూ ఏపీ రాష్ట్రాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన రెండు రోజుల తొలి పర్యటన నిమిత్తం తిరుమలకు వచ్చారు.

అంతకుముందు తిరుమలలోని గాయత్రీ నిలయం విశ్రాంతి గృహానికి చేరుకున్న ఆయనకు జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిషోర్ స్వాగతం పలికారు.

ఇతర అధికారులు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్, అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీమతి సిమోషి, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఆరోగ్య, విద్యాశాఖ టీటీడీ జేఈవో శ్రీమతి గౌతమి తదితరులు పాల్గొన్నారు.