విద్యుత్తు విచారణ కమిషన్ నుండి తప్పుకోండి మాజీ సీఎం కేసీఆర్ !

👉చత్తీస్గడ్ విద్యుత్ కొనుగోలు కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డిని


J.SURENDER KUMAR,

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటి కీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. మీరు ఈ ఛత్తీస్గడ్ విద్యుత్తు కొనుగోలు ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటూ మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.


చత్తీస్గడ్ విద్యుత్ కొనుగోలు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సంవత్సరం మార్చి 14న , జిఓ ఎంఎస్ నెంబర్ 9 ద్వారా జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షతన కమిషన్ నియమించింది.


ఈ మేరకు విచారణ నేపథ్యంలో పలువురి తోపాటు మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ నోటీసులు పంపి వివరణ కోరింది. మాజీ సీఎం కెసిఆర్ శనివారం (15/6/2024 ) జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలో వివరణ లేఖ ను పంపించారు.


కెసిఆర్ లేఖలో పేర్కొన్న కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.

👉 విచారణ పూర్తి కాక ముందే తీర్పు ప్రకటించినట్టు గా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు.


👉అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది.


👉పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.


👉రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని , అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.


👉 కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి, అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు, దీన్ని తక్కువచేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడమే అత్యంత దురదృష్టకరం


👉కమిషన్ చైర్మన్ గా వచ్చిన మీరు పత్రికా విలేఖరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది.


👉 నిజానికి మీ పిలుపు మేరకు, లోక్ సభ ఎన్నికల తర్వాత, 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను.


👉 ఒక ఎంక్వయిరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే మీరు విలేఖరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, పదేండ్లు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయదలిచి ఇచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది.


👉విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరు పక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు, మధ్యవర్తిగా నిలిచి, అసలు నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విది. అన్ని విషయాలను, అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలింది, పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని.


👉 మీ వ్యవహారశైలి: అట్లా లేదని చెప్పడానికి చింతిస్తున్నాను. ఎంక్వయిరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యను గమనించినా, మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు. ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్ధిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టంచేస్తున్నాయి.


👉 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. విచారణ పూర్తి కాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది.
అంటూ పలు అంశాలను మాజీ సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.