28 వేల మంది విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్ అందించే ప్రాజెక్టు !

👉కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో..

J.SURENDER KUMAR,

హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా అందించే పైలట్ ప్రాజెక్టు పనులు పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్షించారు.


కొడంగల్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, సీఎస్సార్‌ ఫండ్స్‌తో నిర్వహించే ఈ కార్యక్రమంపై ఫౌండేషన్ ప్రతినిధులతో. సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నందున, ఆ అంశంపై పూర్తిగా అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా సీఎం వారికి సూచించారు.