J. SURENDER KUMAR,
హైదరాబాద్ శాలిబండ హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలోని ఆదివారం బోనాల జాతర లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి వెంట ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఉన్నారు.
ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబుకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శైలజ రామయ్యర్ ఘనంగా స్వాగతించారు.
మంత్రి ఎమ్మెల్యేలు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా వివరించారు.