ఏపీలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ సమీక్ష సమావేశం!

👉ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన !

👉మంత్రుల సబ్ కమిటీ తొలి సమావేశం!


J.SURENDER KUMAR,

ఆంధ్రప్రదేశ్ లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్ర్రణకు ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ తొలి సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయం లో జరిగింది.
రాష్ట్ర హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో రాష్ట్ర మానవ వరుల అభివృద్ది, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.


రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్ర్రణకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలపై ఈ సబ్ కమిటీ చర్చించింది. అనంతరం సచివాలయం లోని ప్రచార విభాగం లో పాత్రికేయ సమావేశం నిర్వహించి సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు శ్రీమతి అనిత, శ్రీమతి సంధ్యారాణి వెల్లడించారు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నిశ్చయించారని, అందుకు అనుగుణంగా నిర్ణీత ప్రణాళిక ప్రకారం కృషి చేయవలసిన బాధ్యత మనపై ఉంది అని, అన్నారు.
యువత మాదక ద్రవ్యాలకు బానిసైతే వారి భవిష్యత్తుకు, కుటుంబాలకు కూడా తీరని నష్టం జరుగుతుంది అని, కావున గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను నియత్రించడానికి యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను నియమించడానికి హోమ్ శాఖ నిర్ణయించింది , త్వరలోనే ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను కేటాయిస్తాం అని శ్రీమతి అనిత తెలిపారు.


గంజాయి పంటను నాశనం చేయడానికి గత రెండు సంవత్సరాలుగా సెబ్ కు ఎటువంటి అనుమతి ప్రభుత్వం ఇవ్వలేదు. గంజాయి సాగుకు పెట్టుబడి పెట్టే, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని, మత్తు పదార్థాలను అలవాటును నియంత్రించే డి-అడిక్షన్ కేంద్రాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం అని, స్కూల్ దశ నుంచే విద్యార్దులకు గంజాయి వినియోగం, దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తాం అని అన్నారు.


రాష్ట్రంలో ఈ కేసులలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలుగా అత్యధికం మైనర్లే ఉండటం బాధాకరం. గంజాయి సాగుకు పెట్టుబడులు ఎవరు పెడుతున్నారో, డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చిన వారిపై నిఘా ఏర్పాటు చేస్తాం అని, ముందుగా వంద రోజులలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కు కృషి చేస్తామని, గంజాయి సాగుపై సమాచారం ఇచ్చిన వారికి ప్రభుత్వం తరఫున బహుమతి కూడా లభిస్తుంది శ్రీమతి అనిత తెలియజేశారు.


“నిర్మూలన దీర్ఘకాల ప్రక్రియ – నియంత్రణ అత్యంత అవసరం” అని ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
ప్రభుత్వం కేటాయించిన భూముల్లో గంజాయి సాగు, వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను గిరిజనులకు అర్ధం అయ్యేలా అవగాహన సదస్సులు నిర్వహించి, కాఫీ , అల్లం, చింతపండు, పసుపు వంటి పంటలను మాత్రమే ఆ భూముల్లో సాగు చేయాలని మంత్రి శ్రీమతి సంధ్యారాణి అన్నారు.
ప్రలోభాలకు గురై. గిరిజనులు గంజాయి సాగు చేయడానికి ఐటీడిఏ నిర్వీర్యం కావడం కూడా ఒక కారణం. గిరిజనులు వారి పిల్లలను మంచి పౌరులుగా తయారు చేసి, ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుంది అని, అది దృష్టి లో ఉంచుకుని తల్లి దండ్రులు పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాలని మంత్రి తెలిపారు.
పిల్లలు గంజాయి బారిన పడిఉంటే ఎటువంటి భయం లేకుండా సంబంధిత అధికారులకు తెలియజేస్తే, వారి వివరాలు గోప్యంగా ఉంచి, తగు సహాయాన్ని అందించడం జరుగుతుంది అని మంత్రి తెలిపారు. రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమల రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.