ఏపీలో రెండో ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం?

J.SURENDER KUMAR,

ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల కోటాలో శాసనమండలిలో ఏర్పడిన రెండు ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసన సభ కమిటీ హాల్ లో మంగళవారం జరిగింది. దాదాపు రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఫలితాలు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

తెలుగుదేశం పార్టీ తరఫున సి. రామచంద్రయ్య,
జనసేన పార్టీ తరఫున అభ్యర్థి గా పిడుగు హరి ప్రసాద్, లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు.

జనసేన అభ్యర్థి పిడుగు హరిప్రసాద్


రిటర్నింగ్ అధికారి ఎం. విజయరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పి.వి. సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు.
జనసేన పార్టీ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శ్రీమతి లోకం మాధవి, మండలి బుద్ధ ప్రసాద్; తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయ్యావుల కేశవ్, ఎన్. ఎం. డి. ఫారూఖ్, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, యేలూరి సాంబశివరావు హాజరయ్యారు.