👉గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులతో మాట్లాడారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని వారిని ఆదేశించారు.
ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతోందని ఎస్పీ వివరించారు.