బాలిక రేప్ కేసులో నిందితునికి 20 సంవత్సరాలు జైలు శిక్ష !

👉బాధిత బాలికకు ₹ 3 లక్షల రూపాయలు పరిహారం!


J.SURENDER KUMAR,

విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిడి, ప్రలోభాలకు లొంగకుండా, మానవత్వంతో మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన నిందితుడిని, గాలించి పట్టుకొని, న్యాయస్థానం ముందు నిలబెట్టి సాక్షులను ప్రవేశ పెట్టారు పోలీస్. ఫలితంగా అత్యాచారాన్నిందితుడికి న్యాయమూర్తి 20 సంవత్సరాల క్రితం కారాగార శిక్షతో పాటు, బాధిత బాలికకు ₹ 3 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి శ్రీమతి నీలిమ సంచలన తీర్పునిచ్చారు.

👉వివరాలు ఇలా ఉన్నాయి..

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన 4 సంవత్సరాల మైనర్ బాలిక తన ఇంటి దగ్గరలో గల కిరణం షాప్ లో తన అన్న తో కలిసి తినూబండరాలను కొనుకొని ఇంటీ కి వెళ్తున్న సమయం లో అదే గ్రామానికి చెందిన నిందితుడు కండ్లె రమేష్ బాబు వయసు 32 సంవత్సరాలు అనే వ్యక్తి మైనర్ బాలిక అన్నాను కిరాణం షాప్ లోకి వెళ్లి టమాటాలు కొనుక్కొని రమ్మని పంపించాడు .


మైనర్ బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేయగా మైనర్ బాలిక అరుపులు విని అక్కడికి వచ్చిన బాలిక అన్న అ సంఘటన చూసి అరిచాడు. ఇరుగుపొరుగు వారందరూ వచ్చేసరికి నిందితుడైన రమేష్ బాబు పారిపోయాడు.


బాలిక తల్లీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్: 483/2020 U/s 376(AB) IPC & sec 5( m) 6 of Pocso act. పోక్సో చట్టం కింద జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేయగా సర్కిల్ ఇన్స్పెక్టర్ లు రాజేష్ ,కృష్ణ కుమార్ కేసును విచారణ చేపట్టారు.


పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ 24-07-2024 రోజున నిందితుని పై నేరం రుజువు కాగా నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారగార శిక్ష మరియు ₹ 5000/- జరిమాన, బాధిత బాలికలకు ₹ 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.


ఈ కేసులో శిక్ష పడుతుంది గమనించిన నిందితుడు కండ్లే రమేష్ బాబు తేదీ 24 -07-2024 రోజున కోర్టుకు హాజరు కాకుండా పారిపోయాడు. విషయం తెలిసిన న్యాయమూర్తి శ్రీమతి నీలమ, నిందితుడు పై వారెంట్ జారీ చేసింది. మంగళవారం పోలీసులు నిందితుడు కండ్లే రమేష్ బాబు పట్టుకొని జైలుకు తరలించారు.


ఈ కేస్ లో పీపీ మల్లికార్జున్ ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా సి.ఐ లు , రాజేష్ ,కృష్ణ కుమార్ ఎస్సై సతీష్ , CMS ఎస్.ఐ రాజు నాయక్, కోర్ట్ కానిస్టేబుల్ నరేష్ మరియు CMS కానిస్టేబుల్స్ కిరణ్, రాజు మరియు మమత లు నిందితునికి శిక్ష పడడం లో కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో ప్రముఖ పాత్ర వహించారు. నిందితునికి శిక్ష పడటం పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.