పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల న్యాయం కోసం కృషి చేయాలి !


👉జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,


J.SURENDER KUMAR,


పోలీస్ స్టేషన్ కు వచ్చే  బాధితులకు తక్షణమే మీరు న్యాయం కోసం కృషి చేయాలి అని, ప్రజలకు ఎల్లపుడు  అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని, ఫిర్యాదులను జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు.
ఎస్పి సోమవారం  ఆకస్మికంగా ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి  పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు.


ఈ  సందర్బంగా   పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్, స్టేషన్ రైటర్, ఎస్ హెచ్ వో, రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను  5S అమలు తీరును ఎస్పీ పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు,? వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ  ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకున్నారు.  ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. 


డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని , ఆదేశించారు.  సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలలో పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని,
ప్రజలకు ఎల్లపుడు  అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని,  ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఆదేశించారు. 

గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు, యువతను అప్రమత్తం చేయాలని పలు సూచనలు చేశారు.
ఎస్పీ వెంట  డీఎస్పీ ఉమామహేశ్వర రావు, మెట్ పల్లి సీ.ఐ నిరంజన్ రెడ్డి, ఎస్.ఐలు  అనిల్, చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు