👉మాజీ సీఎం కేసీఆర్..
J.SURENDER KUMAR,
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ గురువారం మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్ అంటూ ఆరోపించారు.
మాజీ సీఎం కేసీఆర్ మాటల్లో..
👉రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు జల్లింది
👉రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్టు చెప్పారు
👉ప్రజల గొంతు కోసింది ప్రభుత్వం
👉దళితబంధు పథకం ప్రస్తావనే లేదు
👉దళితులంటే ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా?
👉గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారు
👉ఒత్తిపలకడం తప్ప భట్టి కొత్తగా చెప్పిందేమీ లేదు
👉రైతులను పొగిడినట్టే పొగిడి నిండా ముంచారు
👉బడ్జెట్ ఒట్టి డొల్ల
👉ఈ అర్బక ప్రభుత్వం ఒక్క పాలసీ ఫార్ములేషన్ కూడా చేయలేదు
👉ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది
👉రైతులను ప్రభుత్వం వంచించింది
👉కథ చెప్పారు తప్ప.. బడ్జెట్ పెట్టినట్టు అనిపించలేదు
👉బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్
👉పేదల కోసం ఒక్క పాలసీ అయినా ప్రకటించారా?
👉బడ్జెట్లో ఒక పద్దు.. పద్ధతి లేదు
👉బడ్జెట్పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం
👉ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం
👉భట్టి బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉంది
👉రాష్ట్రంలో విద్యుత్ సరిగా లేదు
👉యాదవులు, మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోలేదు
👉ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చాం
👉ప్రభుత్వానికి పాలసీ లేదని బడ్జెట్ చూసిన తర్వాత అర్థమైంది
👉ఐటీ, పారిశ్రామిక పాలసీ ఏది?
👉ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదు
అంటూ పలు ఆరోపణలు చేశారు.