రేప్ కేసులో 60 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష !

👉మైనర్ బాలికల పై అత్యాచార కేసులో..

👉ప్రతి నేరానికి 20 సంవత్సరాలు మూడు నేరాలలో…

J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా లో 2022 ఏప్రిల్ మాసంలో వెలుగు చూసిన మైనర్ బాలికల అత్యాచారం కేసులో నిందితుడి పై నేరం రుజువు కావడంతో మూడు అత్యాచార కేసులలో ఒక్కొక్క నేరంలో 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు, బాధితులకు ₹ 3 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని జిల్లా న్యాయమూర్తి శ్రీమతి నీలిమ, నిందితుడు కొడిమ్యాల హరికృష్ణ, @ హరీష్ కు 60 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వేస్తూ సంచలన తీర్పునిచ్చారు.

👉వివరాలిలా ఉన్నాయి..

ధర్మపురి పోలీస్ సర్కిల్ పరిధి గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామానికి చెందిన కొడిమ్యాల హరికృష్ణ అలియాస్, @ హరీష్ గ్రామంలో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తుంటాడు. సరుకులు కొరకు దుకాణానికి ఒంటరిగా వచ్చే బాలికలను టార్గెట్ గా చేస్తాడు. బాలికలకు తన సెల్ ఫోన్ ఇచ్చి గేమ్స్ ఆడుకోమని చెప్పి వారిపై లైంగిక దాడి చేసేవాడు, బాలికలను బెదిరించి బైక్ పై ఎక్కించుకొని బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడేవాడు.ఈ విధంగా గ్రామంలోని ముగ్గురు మైనర్ బాలికలపై హరికృష్ణ లైంగిక దాడికి పాల్పడ్డాడని గ్రామానికి చెందిన ఒ వ్యక్తి, హరికృష్ణ చేస్తున్న వికృతి చేష్టలను గమనించి బాలికల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.

బాలికల తల్లులు 2022 ఏప్రిల్ 7 న గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు హరికృష్ణ పై ఫిర్యాదు చేశారు. హరే కృష్ణ పై పోక్సో చట్టం కింద గొల్లపల్లి పోలీస్ స్టేషన్ అప్పటి ఎస్సై శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేశారు. నాటి ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ , జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ దర్యాప్తు చేపట్టి చార్జిషీట్ వేశారు. సాక్షులను న్యాయమూర్తి శ్రీమతి నీలిమ సమక్షంలో ప్రవేశపెట్టి వాంగ్మూలం నమోదు చేయించడంలో పోలీసులు కీలకపాత్ర వహించారు.

నిందితుని పై నేరం రుజువు కాగా నిందితుడికి ఒక్కొక్క కేసుకు 20 సంవత్సరాల చొప్పున కఠిన కారగార శిక్ష మరియు ₹ 5000/- జరిమాన, బాధిత బాలికలకు ఒక్కొక్కరికి ₹ 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని జిల్లా న్యాయమూర్తి శ్రీమతి నీలిమ తీర్పునిచ్చారు.

👉ఛాలెంజ్ గా స్వీకరించిన పోలీసులు

మానవ మృగంలో ప్రవర్తించిన
నిందితుడిని చట్టపరంగా శిక్షించడం కోసం కానిస్టేబుల్ మొదలుకొని డిఎస్పి వరకు అనుబంధ సాక్షాదారాలు సేకరణకు వారు చేసిన కృషిని ప్రజలు అభినందిస్తున్నారు.
అప్పటి జగిత్యాల డీఎస్పీ ప్రకాష్, సీ.ఐ కోటేశ్వర్, ఎస్.ఐ శ్రీధర్ రెడ్డి, పీపీ సీ .బాల త్రిపుర సుందరి , భరోసా సెంటర్ లీగల్ ఆఫీసర్ తేజ, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్ మరియు CMS టీంను శనివారం హైదరాబాద్ లో ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ శ్రీమతి షిఖా గోయల్ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు.

ఈ కార్యక్రమంలో DIG రెమా రాజేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అత్యాచారం కేసు చేదించి నిందితుడికి శిక్షపడేలా కృషిచేసిన పోలీసులను అభినందించారు.