అనుబంధాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


అనుబంధాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.

సోదరీమణులైన మహిళా నాయకులు, ప్రజా ప్రతినిధులు సీఎంకు రాఖీ కట్టారు. మంత్రి ధనసరి అనసూయ,@ సీతక్క ఎంపీ కావ్య , ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి రాగమయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు బండ్రు శోభారాణి, నేరెళ్ల శారద , కాల్వ సుజాత తో పాటు బ్రహ్మకుమారీలు ముఖ్యమంత్రి కి రాఖీ కట్టారు. వారందరికీ ముఖ్యమంత్రి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.


👉 మేము వినగలుగుతున్నాం.. మీరు ఉన్నందుకు థాంక్యూ సీఎం !


ప్రజా ప్ర‌భుత్వ స‌హాయం తో శ‌స్త్రచికిత్సలు చేయించుకుని వినికిడి లోపాల నుంచి కోలుకున్న పలువురు చిన్నారులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీలు క‌ట్టి ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఇటీవల విజయవంతంగా స‌ర్జ‌రీలు చేయించుకున్న చిన్నారుల్లో కొందరు తమ కుటుంబాలతో కలిసి స‌చివాల‌యానికి వ‌చ్చి ముఖ్య‌మంత్రితో రాఖీ సంబురాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో పిల్లలు ఎవరైనా ఖరీదైన వైద్యం అందక మూగ, చెవిటి వారుగా మిగిలిపోవద్దని చెప్పారు. అలాంటి వారికి ఎంత ఖర్చయినా సరే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఉచితంగా శ‌స్త్రచికిత్స‌లు చేయించినందుకు పిల్లల కుటుంబీకులు ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఠి ENT ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ ఆచార్య , వైద్యురాలు డాక్టర్ డీకే వీణ పాల్గొన్నారు.
పుట్టుకతో వినికిడి సమస్యలున్న పిల్లలకు ఐదేండ్ల వయసులోపు చికిత్స అందిస్తే కోలుకునే అవకాశాలు ఎక్కువ. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత చిన్నారుల వైద్యానికి అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని వేగంగా అందిస్తున్నారు.
హైద‌రాబాద్ కోఠిలోని ఈఎన్‌టీ ఆసుప‌త్రిలో కోక్లియర్ ఇంప్లాంట్ (cochlear Implant) స‌ర్జ‌రీలు ఇటీవ‌ల పెద్ద సంఖ్య‌లో జ‌రుగుతున్నాయి. ఎల్‌వోసీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా చిన్నారులకు ఉచితంగా సర్జరీలు చేయడం, ఖ‌రీదైన వినికిడి యంత్రాలు అందించడమే కాకుండా ఏడాది పాటు AVT ( Auditions Verbal Therapy) కూడా అందిస్తున్నారు.


👉లక్ష్మణ్ కుమార్ కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క!


రాఖి పౌర్ణమి సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో మంత్రి శ్రీమతి సీతక్క ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతికి రాఖి కట్టి శుభాకాంక్షలు తెలిపారు.