ఆరోగ్య బీమా కంపెనీకి ఫోరమ్ మొట్టికాయ !


👉 వినియోగదారుడికి బీమా సొమ్ము చెల్లించాలని తీర్పు !


J.SURENDER KUMAR,


వినియోగదారులతో ఆరోగ్య బీమా కంపెనీ అధికారులు అనారోగ్య చర్యలకు పాల్పడితే, వినియోగదారుల ఫోరం ఆరోగ్య భీమా కంపెనీ అనారోగ్య చర్యలకు వైద్యం చేసి సంచలన తీర్పు ఇచ్చి వినియోదారుడికి న్యాయం చేసింది.


👉వివరాలు ఇలా ఉన్నాయి..

జగిత్యాల పట్టణం కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొత్త ప్రతాప్,  ప్రభుత్వ రంగ భీమా కంపెనీ నుండి ఆరోగ్య భీమా పాలసీని, 31-3-2017 నుంచి  30-3-2018   వరకు తీసుకున్నాడు.  తనకు, తన భార్య కు ఆరోగ్య బీమా  వర్తించేలా పాలసీ తీసుకున్నాడు.  దీనికి మెడికల్ ఖర్చుల కై కంపెనీ వారు ₹ 4,00,000/- తనకు, మరియు తన భార్య కు ₹ 3,50,000/- చెల్లించేలా పాలసీ లో పేర్కొనబడింది.


పాలసీ మనుగడలో ఉండగా తను వ్యాపారవేత్త కొత్త ప్రతాప్,   కిమ్స్ సికింద్రాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో  చికిత్స చేయిన్చుకొన్నాడు.  దీనికి ఆసుపత్రిలో బిల్  ₹ 2,90,999/- కాగా అట్టి మొత్తం డబ్బులు చెల్లించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినాడు . దీనిపై భీమా కంపెనీ వారికి వారికీ ఆసుపత్రి బిల్లులను తన క్లెయిమ్ కోసం సమర్పించాడు.  భీమా కంపెనీ వారు ₹ 1,40,000 /-  మాత్రమే వినియోగదారుడు కొత్త ప్రతాప్ కు  చెల్లించారు. మిగితా రూపాయల గూర్చి బీమా కంపెనీ వాళ్ళని అడగగా  వారు చెల్లించడానికి నిరాకరించారు.

ఫోరం తీర్పు.

న్యాయం కోసం  కొత్త ప్రతాప్, జగిత్యాలో ప్రముఖ న్యాయవాది మెట్ట మహేందర్ ను సంప్రదించడు . వినియోదరుల ఫోరం కరీంనగర్ లో 13-4-2018 న కేసు వేయగ అట్టిదానిని పరిశీలించి తేధీ    30-7-2024 న భీమా కంపెనీ  మిగిత  ₹1,40,000/-   9% వడ్డీతో తేది  13-4-2018 నుండి వినియోగదారుడికి డబ్బు చెల్లించే వరకు  ఇవ్వాలని మరియు ఖర్చుల కోసం మరో ₹ 5,000/- ఇవ్వాలని  శ్రీమతి శ్రీలత, మరియు శ్రీ నరసింహారావు సభ్యులు జిల్లా ఫోరం కరీంనగర్. వారు తీర్పునిచ్చారు.