సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదించిన వేములవాడ ఆలయ అర్చకులు !

J.SURENDER KUMAR,


వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డినీ ఆశీర్వదించారు.
ఆలయ అభివృద్ధి పనుల కోసం ₹ 50 కోట్లు కేటాయించినందుకు విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.


ఈ సందర్భంగా రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలు, నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవలసి ఉందని వివరించగా, వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పారు.


సీఎంను కలిసినవారిలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్ , స్థపతి వల్లినాయగం గారు, ఈఈ రాజేష్ , డీఈఈ రఘునందన్ , ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, ఇతర ముఖ్యులు ఉన్నారు.