ఇంటి స్థలాల కోసం రోడ్డెక్కిన జగిత్యాల జర్నలిస్టులు !


👉జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం !


J.SURENDER KUMAR,


జగిత్యాల జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయింపు అంశంలో ఆశలు కలిపిస్తూ దశాబ్దాల కాలంగా చట్టసభలలో ప్రాథమిక వహిస్తున్న ప్రజా ప్రతినిధులపై ఆశలు, నమ్మకం, సన్నా గిల్లుతున్నాయి, నివేశన స్థలాల సాధన కోసం వారు నిరసన బాట  పట్టారు. ‘ పోరాడితే  పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప ‘ అనే నిర్ణయానికి వచ్చారు. సమిష్టి నిర్ణయాలతో దశలవారీగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.


నిరసన లో భాగంగా నాలుగవ రోజు జగిత్యాల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం మానవహారం కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు  పాల్గొని విజయవంతం చేశారు.  అనంతరం ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లి   కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.


ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ

పాత్రికేయులకు న్యాయం జరిగేంత వరకు నిరసన కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామని అన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఈ సందర్భంగా అన్నారు . జర్నలిస్టులకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది ప్రజాప్రతినిధులకు, వివిధ సందర్భాల్లో  అధికారులకు వినతి పత్రాలు సమర్పించి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వపరంగా ఇంతవరకు  జర్నలిస్టుకు లకు ఇళ్ల స్థలాలను కేటాయించలేదన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మాకు మాత్రం న్యాయం జరగడం లేదని  ఇప్పటికైన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు  కృషి చేయాలని కోరారు,.


సీనియర్ పాత్రికేయులు,టీ.వి. సూర్యం మాట్లాడుతూ,
..

మూడు దశాబ్దాలుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మాటిచ్చి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ మాట తప్పారన్నారు, ఇకనైనా మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని అన్నారు .

ఈ కార్యక్రమంలో,  జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ప్రదీప్ కుమార్, టి.యు.డబ్ల్యూ.జే. స్టేట్ కౌన్సిల్ మెంబర్  రాగుల గోపాల చారి, ల తోపాటు  సీనియర్ పాత్రికేయులు, బి సంపూర్ణ చారి, కే మహేష్ కుమార్ , మల్లారెడ్డి, కమలాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి సందీప్ రావు, గడ్డల హరికృష్ణ, దేవేందర్, వేణుగోపాల్,శ్రీధర్ రావు, జహీరుద్దీన్, మదన్, నరేష్, ప్రసాద్, రంజిత్, జిల్లా సత్యం, ఆనంద్, రాజిరెడ్డి, లక్ష్మణ్, సాజిత్, నారాయణరెడ్డి, ఇక్ర మొద్దిన్,  హనుమంత్ పటేల్, బి సత్యనారాయణ గౌడ్, సట్ట శ్రీనివాస్, శనిగారపు శ్రీనివాస్ హరీష్ గౌడ్, ఎస్ రవి, రాజేష్ రాజ్ కుమార్,అంజయ్య బండ స్వామి ,ఫజల్, హైదర్, భరత్ కుమార్, లింగమూర్తి, గాజుల మహేష్, గుర్రం శేఖర్, శ్రవణ్  తదితరులు పాల్గొన్నారు