మిల్లర్లు తాలు తప్ప పేరుతో వరి ధాన్యం కట్టింగ్ చేస్తే రైతులకు న్యాయం చేశారా ?

👉 అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా చూస్తాం !


👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ లో రైతుల పండించిన వరి ధాన్యంను రైస్ మిల్లర్లు పాలు తప్ప పేరిట బస్తా ఒక్కంటికి 5 కిలోలు కటింగ్ చేస్తే , నాయకులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కనీసం రైతుల దగ్గరకి కూడా వెళ్లి అడిగింది లేదని, వారికి న్యాయం చేయలేదని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.


ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం రోజున మండల స్థాయి వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతు రుణమాఫీ విషయం పై అధికారులతో చర్చించి తగు సూచనలు చేశారు


ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.


రుణమాఫీకి సంబంధించి కొన్ని సాంకేతిక ఇబ్బందులు జరిగి కొంత మంది రైతులకు రుణమాఫీ జరగలేదు అట్టి రైతులకు సంబంధించి 45 దరఖాస్తులు తీసుకోవడం జరిగిందన్నారు.
రైతు రుణమాఫీ పైన మాజీ మంత్రులు కేటిఆర్, హరీష్ రావు మరియు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అసత్యపు ప్రచారాన్ని ఖండిస్తున్నాను అని అన్నారు. 2014 నుండి మీరు రైతులకు ఇచ్చిన ఏ హామీ అయినా నిలబెట్టుకున్నారా ? రైతులకు మీరు చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా ? బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఎమ్మెల్యే నిలదీశారు.


మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ₹ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగిందని, ధర్మపురి నియోజక వర్గంలోనీ ధర్మారం మండలంలో మొదటి విడతలో సుమారు 4 వేలకు పైగా రైతులకు ₹ 23 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేయడం జరిగిందని, రెండో విడతలో ₹ 18 కోట్లు, మూడో విడతలో ₹ 18 కోట్లు రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు.


సాంకేతిక పరంగా మాఫీ కాని వాటిని కూడా త్వరలోనే పరిష్కరించి వారికి సాధ్యమైనంత త్వరగా రుణమాఫీ అయ్యేలా చూస్తామని, 80 శాతం రుణమాఫీ చేసినవాళ్ళం 20 శాతం చేయలేమా అని, రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా చూస్తామని, ప్రజా ప్రతినిధిగా అది మా బాధ్యత అని , ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ మోసపూరిత మాటలను రైతులు ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.