ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయాలి !

👉మంత్రులకు మాదిగ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి !


J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషి చేయాలని మంత్రులకు మాదిగ ప్రజా ప్రతినిధులు శుక్రవారం విజ్ఞప్తి చేశారు.

ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో

మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డా.కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య, మందుల శామ్యూల్, ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ ఖాసీం, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండేటి మల్లయ్య, విజయ్ కుమార్ ముంజగళ్ళ, బాపిరాజు,ఎమ్మార్పీఎస్ నాయకులు మేడి పాపయ్య మాదిగ, గోవింద్ నరేష్ కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు మంత్రులు సాలకూలంగా స్పందించారు.