తిరుమల శ్రీవారి ప్రాణదాన ట్రస్ట్‌కు 21 కోట్లవిరాళం!

J.SURENDER KUMAR,


పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌కు చెందిన  రాజిందర్ గుప్తా ఆదివారం టిటిడికి చెందిన ఎస్‌వి ప్రాణదాన ట్రస్ట్‌కు ₹ 21 కోట్లు విరాళంగా ఇచ్చారు.

తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి  సి వెంకయ్య చౌదరికి అదే మొత్తానికి సంబంధించిన చెక్కును దాత అందజేశారు.