సీఎం సహాయ నిధికి విరాళాలు !

J.SURENDER KUMAR,


వరద బాధితుల సహాయార్థం అగ్ర నటుడు మహేశ్ బాబు ముఖ్యమంత్రి సహాయ నిధికి ,₹ 50 లక్షల రూపాయల విరాళం అందించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ సోమవారం నివాసంలో కలిసిన మహేశ్ బాబు ఈ మేరకు విరాళం చెక్కు అందజేశారు. ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (AMB) తరపున కూడా మరో ₹ 10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. మహేశ్ వెంట సతీమణి నమ్రత కూడా ఉన్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు.


👉కోరమండల్ ₹ 50 లక్షలు..


వరద బాధితుల సహాయార్థం కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 50 లక్షల రూపాయల విరాళం అందించింది.

కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.శంకర సుబ్రమణియన్ , సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.