J.SURENDER KUMAR,
వరద బాధితులను ఆదుకోవడం కోసం పలువురు దాతలు సీఎం రేవంత్ రెడ్డి సహాయ నిధికి వరదల కోట్లాది రూపాయల విరాళాలు అందిస్తున్నారు.
👉డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ₹ 5 కోట్లు !
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రఖ్యాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 5కోట్ల రూపాయల విరాళం అందించింది. రెడ్డీస్ ల్యాబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.నారాయణ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రెడ్డీస్ ల్యాబ్ వారిని ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ గ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి , జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు.
👉ఏఎంఆర్ ఇండియా ₹1 కోటి రూపాయలు !

వరద బాధితుల సహాయార్థం ఏఎంఆర్ ఇండియా (AMR India Ltd) సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 1 కోటి రూపాయలు విరాళం అందించింది. కంపెనీ ఎండీ ఎ.మహేష్ కుమార్ రెడ్డి ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
👉వాక్సన్ యూనివర్సిటీ .₹ 50 లక్షలు !

వరద బాధితుల సహాయార్థం వాక్సన్ యూనివర్సిటీ (Woxsen University) ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 50 లక్షల రూపాయల విరాళం అందించింది. యూనివర్సిటీ వ్యవస్థాపకులు ప్రవీణ్ కె.పూల గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం అందించడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
👉వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ సంస్థ .₹ 1 కోటి రూపాయలు!

వరద బాధితుల సహాయార్థం వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1కోటి రూపాయల విరాళం అందించింది. కంపెనీ ప్రతినిధులు ఆర్.సుదర్శన్ రెడ్డి , ఏపీ సంజయ్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. సీఎం తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.
👉 నందమూరి బాలకృష్ణ.₹ 50 లక్షలు !

వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ₹ 50 లక్షల రూపాయల విరాళం అందించారు. బాలకృష్ణ తరపున వారి కూతురు తేజస్విని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. సీఎం తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.