కలెక్టరెట్ లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు !

J.SURENDER KUMAR,


రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యతిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


అంతకుముందు ప్రభుత్వ విప్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, స్వాతంత్య్ర సమరయోధులకు, అధికార అనధికారులకు ప్రజా పాలనా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా విప్ జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.


వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.