👉కాళేశ్వరం-మంథని- రామగిరి సర్క్యూట్ అభివృద్ధి చర్యలు
👉గౌతమేశ్వర ఆలయం వద్ద 2027 పుష్కరాల నిర్వహణకు చర్యలు.!
👉దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ !
J.SURENDER KUMAR,
మంథని ప్రాంతంలోనే దేవాలయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు.
మంగళవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మంథని లోని మహా లక్ష్మి దేవాలయంలో దేవాదాయ, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంత రావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గౌతమేశ్వర దేవాలయాన్ని పురావస్తు శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం పురపాలక కార్యాలయంలో దేవాలయాలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ, కాళేశ్వరం దేవాలయం, మంథని పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను సందర్శించామని అన్నారు. కాళేశ్వరం -మంథని- రామగిరి సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

కాళేశ్వరం దేవాలయం లోపల, పరిసరాలో అభివృద్ధి పనులు చేపట్టే భక్తులకు అవసరమైన వసతులు ఏ రకంగా కల్పించాలనే అంశం పై కాళేశ్వరంలో చర్చించామని అన్నారు. గోదావరి నది ఏ రకంగా శుభ్రం చేయాలి, పుణ్య స్నానాలు చేసేందుకు అవసరమైన షవర్, మహిళలకు స్నానాల గదుల ఏర్పాటు మొదలగు అంశాలను చర్చించామని అన్నారు.
మంథని లోని మంత్రపూట క్షేత్రంలో బౌద్ధ కాలం జన కాలం నాటి విగ్రహాలు దొరికాయని, ఇక్కడ దేవాలయాలను సందర్శించి పెద్దలు, అర్చకులు అధికారులతో చర్చించి అభివృద్ధికి ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని అన్నారు.

మంథనిలోని దేవాలయాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు , వచ్చే భక్తులకు కావాల్సిన సదుపాయాల కల్పన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి రూపొందించే ప్రణాళికల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు.
2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయని, దానికి సంబంధించి ఘాట్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. గౌతమేశ్వర ఆలయం వద్ద పుష్కారాల సమయంలో పార్కింగ్ ఎక్కడ చేయాలో పరిశీలించాలని అన్నారు.
మంథనిలో ఉన్న దేవాలయానికి ఒక గుడి నుంచి మరో గుడికి హెరిటేజ్ వాకింగ్ చేసే దిశగా ప్రణాళిక చర్యలు తీసుకోవాలని అన్నారు. దేవాలయాలకు సంబంధించి కామన్ పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా కళాభారతి లాంటి భవనం నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేయాలని అన్నారు
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, మంథని పట్టణంలో 6 దేవాలయాలు 2 కిమి రెడియస్ లో ఉన్నాయని అన్నారు. సిలేశ్వర సిద్దేశ్వర దేవాలయం పురావస్తు శాఖ పరిధిలో ఉంటుందని అన్నారు.

గౌతమేశ్వర ఆలయం వద్ద స్నానాల ఘాట్, షవర్లు, స్నానపు గదులు ఏర్పాటు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, స్కంద పురాణం క్రింద గౌతమేశ్వర ఆలయ పురాణం తెలుసుకొని దీనికి సంబంధించి లైట్ షో, వాటర్ షో ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
మహాలక్ష్మి ఆలయం వద్ద ఉన్న మహాలక్ష్మి చెరువు ఆక్రమణలు తొలగించి పునరుద్ధరిస్తామని, చెరువులో డ్రైనేజీ వాటర్ కలవకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యాటకశాఖ పరిధిలో రామగిరి జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమా నాయక్, తహసిల్దార్, పురావస్తు శాఖ అధికారులు, దేవాదాయశాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.