గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి!

J.SURENDER KUMAR,


రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించినందునే ఉత్సవ కమిటీలను ఆహ్వానించి వారి విజ్ఞప్తి మేరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఖైరతాబాద్ లో కొలువైన శ్రీ సప్తముఖ మహాశక్తి విశిష్ట గణపతిని శనివారం సందర్శించి ముఖ్యమంత్రి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు.
ఏడు దశాబ్దాలుగా భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. స్వర్గీయ పీజేఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.

ఇటీవల అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని, అందరి పూజలు, దేవుడి ఆశీస్సుల వల్ల తక్కువ నష్టాలతో బయటపడ్డామని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యుడు దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.