ఆసుపత్రిలో మందులు టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయి!

J.SURENDER KUMAR,


ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును గురువారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.


ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..


ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో జ్వరాలతో గ్రామస్తులు బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే గ్రామంలో పర్యటించి జిల్లా కలెక్టర్ మరియు వైద్య అధికారులతో మాట్లాడి హెల్త్ క్యాంపు ను ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కలెక్టర్ తో మాట్లాడి మేడారం గ్రామంలో కూడా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని, మేడారం గ్రామ ప్రజలు మరియు చుట్టూ ప్రక్కన ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఇట్టి హెల్త్ క్యాంప్ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికీ వరకు 100 మందికి పైగా ప్రజలకు పరీక్షలు చేయించుకున్నారన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,.ప్రజలు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదనీ
ప్రతి గ్రామంలో ఆశా కార్యకర్తలు, ANM లు ప్రతి ఇంటికి వెళ్లి జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలు తెలుసుకోవాలని, ఎవరికి ఎటువంటి అవసరం ఉన్న మా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఈ సంధర్బంగా అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు