J.SURENDER KUMAR,
కొందరు మేకల కడుపులో ఔషధాలు ఉత్పత్తి చేస్తూ రహస్యంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఈ వ్యాపారం కొనసాగుతున్నది. ఈ ఔషధ ఉత్పత్తికి ఫార్ముల లేదు, ప్రక్రియ ప్రయోగశాలలో చేయడం లేదు, పరిశోధన రంగాలలో అపార అనుభవం ఉన్న సైంటిస్టులు (పరిశోధనపరులు) ఈ ఫార్ములాను కనుగొలేదు. మేకల కాపరులా ? వాటి యజమానులా ? మేకల వ్యాపారం చేసే దళారులా ? వ్యాపారులా ? అనే అంశంలో స్పష్టత లేదు.
మేక కడుపులో ఉత్పత్తి అయినా ఔషధమును. మేకను చంపి తీస్తారు. దీనిని ‘మేక రాళ్లు’ అంటారు. ప్రత్యేకంగా ఆయుర్వేద వైద్యానికి, ఆయుర్వేద మందులలో ఈ రాళ్ళను వినియోగిస్తారు. తులం కు ₹ 4 వేల నుంచి,₹ 5 వేల వరకు ధర పలుకుతుంది.1
నూటికి నూరు శాతం పక్కా ప్రణాళికతో కొందరు సభ్యులుగా ఏర్పడి మేకల తినే తిండిలో వైవిధ్యం గల ఆకులు, అలముల మొక్కలను మేకలకు మేతగా మేపుతూ వాటి కడుపులో రాళ్ళను పెంచుతారు. మేకలు తినే ఈ తరహా మేత జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామ శివారు ‘జెండా గుట్ట’ అటవీ ప్రాంతంలో ఉన్నాయి.
👉మేక రాళ్లకు ఎనలేని డిమాండ్ !

మేకలను చంపి వాటి శరీరం నుంచి తీసే రాళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఆయుర్వేద ఇతర ఔషధాల తయారీకి ముంబై, హాంకాంగ్, థాయిలాండ్ దేశాలకు అత్యధిక ధరలకు విక్రయిస్తారని, నిజామాబాద్, నాందేడ్, ఖమ్మం , కేంద్రాలుగా ఈ రాళ్ల వ్యాపారం జరుగుతుందనేది చర్చ.
👉కమలాపూర్ జెండా గుట్ట ..
ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామ శివారు జెండా గుట్ట ప్రాంత అడవిలో మేకల కడుపులో రాళ్లు పెరిగే మొక్కలు విస్తారంగా ఉన్నాయి.. ఇదే జిల్లా రాయికల్ మండల అటవీ ప్రాంతంలోనూ. ఉన్నాయి.
👉కొన్ని నెలల పాట గుట్టపై నివాసం!

నిజాంబాద్ జిల్లాలో నుంచి వందలాది సంఖ్యలో మేకలు మూడు నాలుగు బృందాలుగా కమలాపూర్ జెండా గుట్టపై మేతకు, వ్యాపారులో, దళారీలో, వాటి యజమానులో తెలియదు కానీ, మేకల మందను తరలిస్తూ కొన్ని నెలల పాటు ఈ గుట్టపై నివాసం ఉంటారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కొన్ని నెలల పాటు మేకలను గుట్ట కిందకి దిగనివ్వరు, మేకలను మేపడానికి ఈ ప్రాంతంలోకి వచ్చినందున శివారు పంచాయతీ కమలాపూర్ గ్రామానికి అనధికారికంగా ₹40 వేల నుండి ₹ 50 వేల వరకు వారు చెల్లిస్తుంటారు. ఈ డబ్బులు గ్రామ అభివృద్ధి కోసం, ఉత్సవాల నిర్వహణకు ఖర్చు చేస్తుంటారు.
👉మేకల కడుపులో రాళ్ల ఉత్పత్తి ఎలా అంటే !

కిడ్నీ, గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడి మనుషులు అనారోగ్య బారిన పడిన సందర్భాలలో మందులతో పాటు మనం తీసుకునే ఆహారంలో కాల్షియం తక్కువ మోతాదులో ఉండాలి, అంటూ వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తారు. మేక కడుపులో రాళ్లు ఉత్పత్తి కోసం….
మేకల జీర్ణాశయాలలో రాళ్లు పెరగడానికి ప్రత్యేకంగా ఓ తరహా మేతను మేపుతారు. మేకలు సహజంగా అన్ని రకాల చెట్ల ఆకులు తింటాయి. ( సీతాఫలం చెట్టు ఆకు మినహా ). అయితే రాళ్ల ఉత్పత్తికి ‘కోడిసె ఆకులు’ చిట్టి రేణి పండ్ల ముళ్ళకంప చెట్టు ఆకులను ‘ పోతప్ప ఆకు ను మూడు నాలుగు నెలల పాటు వీటిని మేకలు తింటే వాటి పెద్ద పేగు లో (జీర్ణశం) సెప్టెంబర్ అక్టోబర్ మాసం వరకు రాళ్లు పెరుగుతాయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కొన్ని నెలల పాటు మేకలను గుట్ట కిందకి దిగనివ్వరు దీనికి కారణం మేకలు వీటితో పాటు ఇతర ఆకులు తింటే వాటి జీర్ణాశయంలో రాళ్లు పెరగవు, పెరిగిన రాళ్లు వాటి మలవిసర్జనల్లో పోతాయని జాగ్రత్త పడుతుంటారు.
పితృపక్షాలు, దసరా ఉత్సవాలు మహాలయాల అమావాస్య. రోజులలో మేకల మాంసం దళారులు, వ్యాపారులు, విక్రయిస్తుంటారు. ఈ రోజుల్లో మాంసానికి డిమాండ్ ఉంటుంది.
👉మాంసం విషతుల్యం…

విషతుల్యమైన చెట్ల ఆకులను రాళ్ల కోసం దళారులు మేకలకు మేత తినిపించడంతో . జీర్ణాశయంలో రాళ్లు ళ్ఉత్పత్తి అవుతున్న మేకలు బలహీన పడి నడవలేని స్థితికి చేరుకుంటాయని. అవి సహజంగా మృతి చెందిన సందర్భాలలో దుర్గంధపూరితమైన భరించలేని దుర్వాసన వస్తుందని కమలాపూర్ మాజీ సర్పంచ్ భర్త చిట్టనోజ్ ప్రసాద్ అన్నారు. మేకను రాళ్ల కోసం చంపిన వాటి మాంసం తినడానికి అధిక శాతం తిరస్కరిస్తారని తెలిపారు.
👉వ్యాపారంలో పోటీతో …?
మేక రాళ్ల వ్యాపారంలో పోటీతోనో, గ్రామాలలో రాజకీయ పార్టీల ఆధిపత్యపు పోరో తెలియదు కానీ, 2016 – 17 లో కమలాపూర్ గుట్ట రిజర్వ్ అడవులలో మేకలు ఉండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది గుట్ట చుట్టూ ముట్టారు. తమ అనుమతి లేకుండా అడవిలో మేకలు ఎలా మేస్తాయని, వారిపై కేసులు నమోదుకు సిద్ధమయ్యారు. నాటి ఆ గ్రామ సర్పంచ్ భర్త జోక్యం చేసుకొని. మేకల కాపర్లు పక్షాన అటవీ శాఖకు జరిమానా చెల్లించారు. నాటినుండి ఈ ప్రాంతానికి వారు రావడానికి భయపడుతున్నారో, వ్యాపారంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో, పరస్పరంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారో తెలియదు కానీ ఈ ప్రాంతానికి వందల సంఖ్యలో మేకలు రావడం మాత్రం తగ్గిపోయింది.
మనిషి తన కిడ్నీ, గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడితే ఎంత నరకయాతన అనుభవిస్తాడో తెలియదు కానీ, తమ వ్యాపారం కోసం నోరులేని మూగజీవాల జీర్ణాశయాలలో రాళ్లను ఉత్పత్తి చేస్తున్న క్రమంలో అమాయకపు జీవాలను నరకయాతనకు గురి చేస్తున్న తీరు బాధాకరం.