👉పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!
J.SURENDER KUMAR,
ప్రకృతి వైపారీత్యాల తో రాష్ట్రం అతలాకూతలం అయ్యింది అని సీఎం రేవంత్ సహచర మంత్రులు సభ్యులు స్థానిక పరిస్థితి పరిశీలన చేసి సహాయక చర్యలు చేపట్టాలని నిర్ణయించుకొని ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. అంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల పట్టణంలోని ఇందిరాభవన్ లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
జీవన్ రెడ్డి మాటలలో..
👉ఆర్థిక చేదోడు ఆదుకోవాలనే భవన, ఇండ్లు కూలిపోయిన వరికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పంటలు నష్టపోయినా రైతులకు ఎకరాకు ₹10 వేలు, ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కు ₹ 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
👉దశబ్ద కాలంలో ప్రకృతి వైపారీత్యాల నష్టం పై ప్రభుత్వం ఆదుకున్న ఉదాంతం నేను గమనించలేదు.
👉రోళ్ళావాగు వరద తో ఇసుక బ్లీచ్ అయిన ఒక రూపాయి పైస అందించలేదు.
👉రాష్ట్రం ప్రభుత్వం తక్షణమే సాయం, ఆర్థిక సాయం, చేయడం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నారు.
👉గతంలో. అధికారం లో ఉన్నప్పుడు ఎం చేశారు అనేది ఆత్మ విమర్శలు చేసుకోవాలి ప్రతిపక్షం అంటే విమర్శలు మాత్రమే కాదు.
👉కేసీఆర్ స్వయంగా పర్యటించకపోవడం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేయడం విచారకరం.
👉కేటీఆర్ విదేశీ యాత్ర రద్దు చేసుకొని చర్యలు చేపట్టల్సిన అవసరం ఉండే. కని ఎక్స్ వేదికకే పరిమితం అయ్యారు.
👉హైడ్రా ఏర్పాటు తో హైదరాబాద్ నాగర పరిధిలో జలషయాలు పరిరక్షణ కు చర్యలు గైకొంటే ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
👉ఈ హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లా పరిధిలోకి రావాలని ప్రజానీకం కోరుకోవడం తో సీఎం రేవంత్ అక్రమణలా తొలగింపు పరిరక్షణ కు చర్యలు చెప్పాడుతామణి ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తున్న.
👉ఖమ్మం మున్నరు వాగు ఆక్రమణ తో ఆ పరిస్థితి వచ్చింది. ఆక్రమణ లతో వరద ఉద్రిటిని తట్టుకునే పరిస్థితి ఉండదు.
👉భవిష్యత్ లో ఇలాంటి ఉపాధ్రవాలు కలగకుండా హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చర్యలు చేపట్టడం భవిష్యత్ తరాలకు శుభసూచకం.
👉పదివేల ప్రకటనా తక్షణ సాయం.. మృతుల కుటుంబలకు ₹ 5 లక్షలు ప్రకటించింది. నష్టం పదివేల కొట్లు ఉంటుందని అంచనా.
👉పరిహారం కనీసం ₹ 5 వేల కోట్ల అయిన గ్రాంట్ గా కల్పించాలి. సహాయక చర్యలకు తోడ్పాడాలి.
👉బీఆరెస్ నాయకులు బిజెపి నాయకులు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి.
👉ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరదల సమయంలో నిమగ్నం అయి ఉన్నారు.
👉ప్రతిపక్షం రాజకీయ విమర్శలకు తావివ్వకుండా సలహాలు సూచనలు ఇవ్వండి.
👉కిషన్ రెడ్డి బండి సంజయ్ లు గ్రాంట్ కొరకు చొరవ చూపాలి అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.