గంగారెడ్డి హత్యలో ఎంతటి వారైనా శిక్ష తప్పదు మంత్రి శ్రీధర్ బాబు!

👉 జాబితాపూర్లో గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి !


J.SURENDER KUMAR,


కాంగ్రెస్‌ పార్టీ కోసం దశాబ్ద కాలంగా పనిచేసిన గంగారెడ్డి హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందులో ఎంతటి వారు చట్టపరంగా శిక్ష తప్పదు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గంగారెడ్డి కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.


జగిత్యాల మండలం జాబితాపూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మారు గంగారెడ్డి ఈ నెల 22న హత్యకు గురి కాగా  గంగారెడ్డి కుటుంబాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రామగుండం ఎమ్మెల్యే మక్కన్‌సింగ్‌తో కలిసి పరామర్శించి కుటుంబాన్ని ఓదార్చారు..


అనంతరం మీడితో మాట్లాడుతూ.. గంగారెడ్డి హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు.. తాను, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ డీజీపీతో, జిల్లా ఎస్పీతో మాట్లాడన్నారు.

A..D..V..T

. కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా పూర్తి విచారణ జరుగుతుందన్నారు.. నిందితుడికి పోలీసులతో ఉన్న సంబంధాలపై కూడా విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.