గ్రూప్స్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి!

👉జిల్లాల్లో ప్రశ్నాపత్రాలను భద్రపరుచుటకు స్ట్రాంగ్ రూమ్ లను వెంటనే గుర్తించాలి !


👉వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న TSPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి !


J.SURENDER KUMAR,


జిల్లాలలో గ్రూప్స్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పటిష్టం చేస్తూ సన్నద్ధం కావాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు.


శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు.

జిల్లాలలో చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలని, ఈ ప్రక్రియ రేపటి లోగా పూర్తి చేయాలని కమిషన్ చైర్మన్ కలెక్టర్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత అభ్యర్థుల వివరాలతో కూడిన ఓఎంఆర్ షిట్ల ముద్రణ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.

జిల్లాలో పరీక్ష ప్రశ్నా పత్రాల, ఇతర ముఖ్యమైన సామాగ్రి భద్రపర్చేందుకు స్ట్రాంగ్ రూమ్ లను గుర్తించాలని అన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు వీలుగా జిల్లాలోని ఒక ప్రాంతంలో ఉన్న పరీక్షా కేంద్రాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించాలని అన్నారు. గ్రూప్ 3 పరీక్షకు 3 పేపర్, గ్రూప్ 2 పరీక్ష 4 పేపర్లు పెద్ద ఎత్తున సభ్యులు ఉన్న నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్ పరిధిలో స్ట్రాంగ్ రూమ్ గుర్తించాలని అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ పరిధిలో అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన మేర స్ట్రాంగ్ రూమ్ ఉండాలని అన్నారు.


జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ..


జిల్లాలో అదనపు కలెక్టర్ , లోకల్ బాడీస్, పోలీస్ నోడల్ అధికారి, ఆర్డీఓ అందరూ సమన్వయం చేసుకుంటున్నారని, జిల్లాలో 34 సెంటర్లను గుర్తించడం జరిగిందని, జగిత్యాల జిల్లా నుండి సుమారు 11 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు, ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని ఆయన తెలిపారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గౌతమ్ రెడ్డి, ఆర్డీఓ మధు సుధన్, ఏఎస్పీ భీమ్ రావు, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.