👉 గల్ఫ్ కార్మికుల సమస్యల అధ్యయనానికి త్వరలో అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు !
J.SURENDER KUMAR,
సౌదీ అరేబియాలో మృతి చెందిన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పులి అంజయ్య కుటుంబానికి మంగళవారం ₹ 5 లక్షల గల్ఫ్ ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రం (ప్రొసీడింగ్స్) ను మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ₹.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమం అని అన్నారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి హైదరాబాద్ ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ కౌంటర్ ఏర్పాటు చేశామని, గల్ఫ్ కార్మికుల సమస్యలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు చేయడానికి త్వరలో అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.
కాంగ్రేస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ‘గల్ఫ్ గ్యారంటీ’ ని అమలు చేసిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షులు బి. మహేశ్ కుమార్ గౌడ్ కు, మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు అందరికీ కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
👉మంద భీమ్ రెడ్డి కృషి ఫలించంది !

గల్ఫ్ లో బాధితుల కష్టాలు, వారి కుటుంబ సమస్యలు, గల్ఫ్ దేశంలో మృతి చెందిన తెలుగు రాష్ట్రాల కార్మికుల నష్టపరిహారం కోసం ఆదేశాల్లో న్యాయపోరాటం, ఆయా కంపెనీలతో నష్టపరిహారం ఇప్పించడం, మృతదేహాలను స్వగ్రామాలకు తెప్పించడంలో కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి కృషి తెలుగు రాష్ట్రాల గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులకు తెలుసు.
గల్ఫ్ లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం , వారి పిల్లల విద్యా వైద్యం తేజ సమస్యల పరిష్కారం కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో భీమ్ రెడ్డి రాజీలేని ప్రజాస్వామిక పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ సమస్య పరిష్కారనికి తదితర అంశాలు పొందుపరచడంలో కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించడంలో భీమ్ రెడ్డి పాత్ర కీలకం. దశాబ్దాల కాలం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని బోధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు