👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
దశాబ్ద కాలంగా అష్ట కష్టాలు పడుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు బాధితుల ఇంటి ముంగిటకు కోట్లాది రూపాయల నష్టపరిహారం అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
వెల్గటూర్ మండలం చెగ్యం గ్రామ 126 నివాసాలకు చెందిన ముంపు బాధితులకు ప్రభుత్వం విడుదల చేసిన ₹ 18 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కులను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలసి
శనివారం బాధితులకు పంపిణీ చేశారు

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ఎన్నికల సందర్భంగా తాను ఈ ప్రాంత బాధితులకు ఇచ్చిన హామీ మేరకు దశాబ్ద కాలంగా కోట్లాది రూపాయల నష్ట పరిహార డబ్బులు బాధితుల ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేయడం పంపిణీ చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.
గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకుడు బాధితుల గురించి పట్టించుకోలేదని, ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఎంతో మంది భూములు,ఇండ్లు కోల్పోయిన వారి దుస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ను కలిసి వారికి పరిస్థితి వివరించి పరిహారం మంజూరు చేయించానని ఎమ్మెల్యే అన్నారు.

కొంత మంది ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం జరుగుతుందని, వారి హయంలో బాధితులకు పరిహారాన్ని అందిస్తాం అంటే మేము ఎక్కడ అడ్డుపడలేదని,ఒక ఎమ్మెల్యే గా,విప్ గా, మంత్రిగా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ ఎందుకు పరిహారాన్ని అందించలేదో ప్రజలకు చెప్పాలని, ఇకనైనా ప్రతిపక్ష నాయకులు వారి వైఖరిని మార్చుకోవాలని అన్నారు. పరిహారం రాని బాధితులు ఎవరైనా ఉన్న వారికి కూడా పరిహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.