స్కిల్స్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ ₹100 కోట్ల విరాళం !

J.SURENDER KUMAR,


స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల భారీ విరాళం శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి అందించింది.
విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేసింది
.

అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు కలసి.విరాళం చెక్కును అందజేశారు. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మద్దతు ఉంటుందని గౌతమ్ అదానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.