టీటీడీ శ్రీవారి ఆన్‌లైన్ టికెట్లు జనవరి 2025 కోటా వివరాలు!

J.SURENDER KUMAR,


2025 జనవరి నెలలో శ్రీవారి దర్శనం, వసతి కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి టిటిడి శ్రీకారం చుట్టింది.
వివరాలు ఇలా..
.

👉 శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్ అక్టోబర్ 19 ఉదయం 10 గంటల నుండి అక్టోబర్ 21 ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

👉శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు అనగా కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు SD సేవ అక్టోబర్ 22 ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి,

👉 అలాగే వర్చువల్ సేవా టిక్కెట్లు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయబడతాయి.


👉తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు అక్టోబర్ 23 నుండి ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి.


👉శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం మరియు వసతి కోటా అక్టోబర్ 23 ఉదయం 11గంటలకు అందుబాటులో ఉంటుంది.


👉సీనియర్ సిటిజన్స్/ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా అక్టోబర్ 23 మధ్యాహ్నం 3 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.

👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹ 300) టిక్కెట్లు అక్టోబర్ 24న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి

👉తిరుమల & తిరుపతి వసతి కోటా అక్టోబర్ 24 మధ్యాహ్నం 3 గంటల నుండి అందుబాటులో ఉంటుంది అని తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.