👉 జగిత్యాల జిల్లాలో తరుగు పేరిట 2 లక్షల క్వింటాలకు పైగా వరి ధాన్యం తూకం !
👉 తరుగు ధాన్యం విలువ ₹ 43 కోట్ల 9 లక్షలు 43 వేల 760
/-
👉 జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు !
J. SURENDER KUMAR,
గత కొన్ని రోజుల క్రితం జగిత్యాల జిల్లాలోని 6 సింగిల్ విండోలు, 2 డి సి ఎం ఎస్ కేంద్రాలలో దాదాపు ₹ 7.36 కోట్ల నిధులు గోల్మాల్ అయినట్టు సంబంధిత శాఖ అధికారుల విచారణలో వెలుగు చూసి ఆరుగురు CEO సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
👉 60 వేల మంది రైతుల నుంచి..
జగిత్యాల జిల్లాలో 60393 మంది రైతుల వరి ధాన్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. తాలు, తప్ప, తరుగు పేరిట అధికంగా తూకం వేసిన ధాన్యం మొత్తం 2 లక్షల, 9 వేల 196 క్వింటాళ్లు, క్వింటాల్ ఒక్కంటికి ₹ 2060/- చొప్పున లెక్కించగా దాదాపు ₹ 43 కోట్ల 9 లక్షలు 43 వేల, 760/- ( నలభై మూడు కోట్ల తొమ్మిది లక్షలు, 43 వేల 760/- రూపాయలు) కొనుగోలు నిర్వాహకులు రాబందుల్లా స్వహ చేశారు అనే చర్చ మొదలైంది.
👉 2022-23 లో415 కొనుగోలు కేంద్రాల ద్వారా..
జగిత్యాల జిల్లాలో 2022-23 లో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కు ప్రభుత్వం 418 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో IKP ద్వారా 144 కేంద్రాలను, PAC ద్వారా 270 కేంద్రాలను MEPMA ద్వారా ఒక్కటి, మొత్తం 415 కేంద్రాలలో, 60393 మంది రైతుల నుంచి 4,18,392 మెట్రిక్ టన్నులు ( నాలుగు లక్షల, పది యెనిమిది వేల మూడువందల తొంబై రెండు మెట్రిక్ టన్నులు) ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు రికార్డులలో నమోదు చేశారు.
👉 రైతుల ఖాతాల్లోకి..
ప్రభుత్వం నిర్ణయించిన ధర @క్వింటాల్ కు. ₹ 2060/- జిల్లాలో. 4,18,392 మెట్రిక్ టన్నుల వడ్లకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం @క్వింటాల్ కు. ₹ 2060/- చొప్పున. రైతులకు ₹ 861, కోట్ల, 88, లక్షల, 75 వేల 200/- ( ఎనిమిది వందల అరువది ఒక్క కోట్ల ఏనుభది యెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందలు) రైతులకు చెల్లించారు. 2033 ఏప్రిల్ చివరి మాసం నుండి జూన్ 14 వరకు కొనుగోలు చేసినట్టు ప్రభుత్వ రికార్డులలో నమోదైన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
👉 2 లక్షల 9 వేల 196 క్వింటాళ్ల వరి ధాన్యం అదనపు తూకం ఎలా అంటే !

కొనుగోలు చేసిన ధాన్యం మొత్తం 41 లక్షల 83 వేల 920 క్వింటాల్ కాగా, క్వింటాల్ కు 5 నుంచి 10 కిలోల చొప్పున అదనపు తూకం ద్వారా 60393 మంది రైతుల నుంచి 2 లక్షల 9 వేల 196 క్వింటాళ్ల వడ్ల ను నిర్బంధంగా అదనపు తూకం వేసుకున్నారు. ఈ వివరాలను రికార్డులలో నమోదు చేయరు, చేయలేదు కూడా, ట్రక్ షీట్లలో నమోదైన తూకం వివరాల మేరకె ప్రభుత్వం రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తారు.
(ఐకెపి కేంద్రాలలో అదనపు తూకం వేసినా, ట్రక్ షీట్ లో మాత్రం క్వింటాల్ గానే నమోదు చేస్తారు ) తరుగు పేరిట అదనంగా తూకం వేస్తున్న దాదాపు పది కిలోల వరి ధాన్యం గూర్చి రైతులు మాకు అన్యాయం జరుగుతున్నది న్యాయం చేయండి అంటూ నిరసనలు రాస్తారోకోలు, చేసిన నాటి అధికార పార్టీ, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్ల పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనీసం ఈ అంశంలో నాటి ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించలేదు. ఈ అంశాలు జగమెరిగిన సత్యం. తరుగు పేరిట అధికంగా తూకం వేసిన
👉 అదనపు తూకం వరి ధాన్యం విలువ ₹ 43 కోట్లు..
క్వింటాల్ ఒక్కంటికి ₹ 2060/- చొప్పున లెక్కించగా దాదాపు ( ₹ 43 కోట్ల 9 లక్షలు 43 వేల, 760/-) నలభై మూడు కోట్ల తొమ్మిది లక్షలు, 43 వేల 760/- రూపాయల
మొత్తం ఎవరి ఖాతాలో జమ చేశారో ? రాబందులా ఎవరు స్వాహా చేశారో ? అంతుచిక్కని చిదంబర రహస్యం.
ప్రభుత్వ యంత్రాంగం సి బి సి ఐ డి ద్వారా విచారణ జరిపితే నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది.