👉 యూపీ జర్నలిస్టుకు మధ్యంతర ఊరట కల్పించిన సుప్రీంకోర్టు!
J.SURENDER KUMAR,
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనలో కుల గతిశీలతపై కథనానికి సంబంధించి జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు జర్నలిస్టుకు శుక్రవారం మధ్యంతర ఊరట కనిపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

న్యాయమూర్తులు హృషికేష్ రాయ్ మరియు ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఉపాధ్యాయ్ తన పాత్రికేయ పాత్రపై యుపి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తూ, ధర్మాసనం నవంబర్ 5న కేసును విచారించనున్నది.
“ప్రజాస్వామ్య దేశాలలో, ఒకరి అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను గౌరవిస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి. జర్నలిస్టుపై కేసులు పెట్టకూడదు ‘ అని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

సౌజన్యంతో..