బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మాట నిలుపుకుంది!

👉మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య !


J.SURENDER KUMAR,


బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్.కృష్ణయ్య , బీసీ సంఘం నేతలు సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి నీ కలసి అన్నారు. బీసీ రిజర్వేషన్, ఆ ప్రక్రియలోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.


న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు.


బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య , ఎమ్మెల్యే దానం నాగేందర్ , ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వి.కృష్ణమోహన్ రావు, బీసీ సంఘాలకు చెందిన ఇతర నేతలు ముఖ్యమంత్రి ని కలిసి ధన్యవాదాలు తెలిపారు.