👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇలాంటి బూటకపు పాదయాత్రలు చేస్తూ పత్రికా సమావేశాలలో ఆరోపణలు చేస్తున్నారని, ఎన్ని పాదయాత్రలు చేసినా, రైతులు , ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
మీడియా సమావేశ ముఖ్యాంశాలు..
👉 కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు వారి తండ్రి మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రభుత్వం పై చేసిన అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం..
👉 2014 నుండి 2023 వరకు బి.ఆర్.ఎస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఎన్ని హామీలను అమలు చేశారో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి.
👉 జగిత్యాల జిల్లాకు వారి ప్రభుత్వ హయంలో ఏం మేలు చేశారని కేటీఆర్ జిల్లాకు వస్తున్నారు. ప్రజలకు ఏం చేశారో జవాబు చెప్పి పాదయాత్ర మొదలుపెట్టండి
👉 మీ ప్రభుత్వ హయంలో మిల్లర్లు కటింగ్ పేరిట రైతులను దోచుకుంటే కనీసం స్పందించని మీరు, రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే, వారి కుటుంబాలను పరామర్శించనీ మీరు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారా ?
👉 రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం బి.ఆర్.ఎస్ ప్రభుత్వమే
👉 మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువెత్తున దోచుకున్నారు. మా ప్రభుత్వంలో జిల్లాకు చెందిన సుమారు 65 వేల మంది రైతులకు ₹ 2 లక్షల రూపాయల మేర రుణాలు మాఫీ చేశాం.
👉 మా ప్రభుత్వం వచ్చి కేవలం 11 నెలలు మాత్రమే అయింది, ఈ కొద్ది సమయంలోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ₹ 500 కి గ్యాస్ సిలిండర్, ₹ 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ₹ 2 లక్షల రుణమాఫీ, ఉద్యోగస్తులకు నియామక ఉత్తర్వులు పంపిణీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు అమలు చేసి చూపించాం. త్వరలోనే పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా పంపిణీ చేస్తాం.
👉 ఇన్ని సంక్షేమ పథకాలకు అమలు చేస్తే బి.ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రం మా పైన అసత్యాలను ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని నిజం అని పలు మార్లు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు..