సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన ఇలా..


J.SURENDER KUMAR,


హైదరాబాద్ బేగంపేట్ నుంచి ఉదయం హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.

👉సీఎం శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోనున్నారు. స్వామి వారి దర్శనానంతరం సీఎం మూసీ పునరుజ్జీవన సంకల్పంలో భాగంగా నది ఒడ్డున సంగెం నుంచి భీమలింగం వరకు పాదయాత్ర చేపడుతారు.


👉అనంతరం రోడ్డు మార్లంలో సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్పం చేపడుతారు. సంగెం నుంచి పాదయాత్రగా మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలో మీటర్ల పాదయాత్ర చేస్తారు.


👉అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంట సంగెం – నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేసి అక్కడ యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమవుతారు
.