సీఎం సహాయ నిధికి 1.50 కోట్ల విరాళం !

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు లిమిటెడ్ (TGCAB) పాలకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధి కి బుధవారం ₹ 1,51,01,116 విరాళం ఇచ్చారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి టీజీకాబ్ పాలకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. TGCAB చైర్మన్ ఎం.రవీందర్ రావు , వైస్ చైర్మన్ కె.సత్తయ్య , పలువురు డైరెక్టర్లు ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఉన్నారు.