ఎన్నికల్లో మాట ఇచ్చాను పంపిణీ చేసి చూపిస్తున్నాను !

👉ఎన్నికలలో చెగ్యం గ్రామ బొడ్రాయి సాక్షిగా ఇచ్చిన హామీ అమలు !

👉 ₹18 కోట్లాది రూపాయల ముంపు నష్టపరిహారం చెల్లింపు!

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామ ప్రజల ముందు ప్రమాణం చేసి

ఎల్లంపల్లి ముంపు బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తాను

అని చెప్పాను దశలవారీగా ₹ 18 కోట్ల రూపాయలు

మీకు పంపిణీ చేసి చూపిస్తున్నాను

అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


వెల్గటూర్ మండలంలోని చేగ్యం గ్రామ ముంపు బాధితులకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ₹ 18 కోట్ల రూపాయల నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను గురువారం చేగ్యాం గ్రామంలోని స్థానిక రైతు వేదిక వద్ద. ముంపు బాధితులకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తో కలిసి ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు.


👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..


ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు సంబంధించి 63 మంది లబ్దిదారులను గత పది సంవత్సరాల కాలంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే మీ భూముల ముంపు నష్టపరిహారం డబ్బులు ఇప్పించడానికి కృషి చేస్తానని బొడ్రాయి సాక్షిగా ప్రమాణం చేశాను అంటూ నాటి ప్రమాణంలో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే ముంపు బాధితులకు గుర్తు చేశారు. నష్టపరిహారం చెక్కులను ఎంపి వంశి తో కలిసి పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.


ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద వంశపార్యంపర వ్యవసాయ భూములను గ్రామ ప్రజలు కోల్పోవడం బాధాకరమన్నారు.
వారికి ప్రభుత్వపరంగా ముంపు పరిహారం అందించే విషయంలో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ నాయకులు ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు.


చెగ్యం గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించడంలో పెద్దలు కీ.శే కాక వెంకట స్వామి పాత్ర ఎంతో ఉందని, తాను జడ్పీ చైర్మన్ గా అప్పటి పెద్దపల్లి ఎంపీ వివేక్ ఈ ప్రాంత విషయం పైన శ్రీధర్ బాబు దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి పలు మార్లు తీసుకెళ్లడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.

బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ముంపు బాధితులు నష్ట పరిహారం కోసం చేసిన ప్రతి నిరసనలో, ఆందోళన ధర్నాలో వారి వెంట మేము ఉన్నామని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. తాను ఎన్నికల సమయంలో దశల వారీగా బాధితులకు పరిహారం ఇప్పిస్తాం అని ఇచ్చిన హామీ మేరకు బాధితులకు చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నారు.


అర్హత ఉండి పరిహారం అందని వారు ఎవరైనా ఉంటే వారికి కూడా పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు..
ఈ కార్యక్రమంలో జిల్లా RDO ,మండల అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు