👉ఎమ్మెల్సి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ..
J.SURENDER KUMAR,
హరీష్ రావు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, కాంగ్రెస్ హయం లో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచింది, ధాన్యం సేకరణ లో గత ఖరీఫ్ కంటే ముందంజ లో ఉన్నాం. అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రం లో ని ఇందిరా భవన్ లో బుధవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ లు మీడియాతో మాట్లాడారు.
👉 బి ఆర్ ఎస్ నాయకుల ఫై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫై కామెంట్స్
గత ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది
ప్రభుత్వం మూసి ప్రక్షాళన అవశ్యకత ను గుర్తించి మూసి ప్రక్షాళన మొదలు పెట్టారు మూసి ప్రక్షాళన లో నిర్వసితుల కు న్యాయం చేసిన తర్వాతే మూసి ప్రక్షాళన మొదలు పెడుతాం
ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయం లో రైతుల కు చేసిన రుణమాఫీ కేవలం వడ్డీ మాఫీగా నే మిగిలిపోయింది..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో కి వచ్చాక ఏక కాలం లో ₹ 18000 కోట్ల తో రైతుల కు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నాం
రుణమాఫీ కాని రైతుల కు ఈ నేల చివరి లో పూర్తిగా రుణమాఫీ చేస్తాం
👉హరీష్ రావు ఫై విప్ లక్ష్మణ్ కుమార్ కామెంట్స్ ….
డిపెండెంట్ లీడర్ సంజయ్ పాదయాత్ర చేస్తే
సాంకేతిక కారణ ల తో రైతు రుణమాఫీ లో కొంత జాప్యం జరిగింది
రుణమాఫీ కాని రైతుల సమస్య గురించి సీఎం దృష్టి కి తీసుకెళ్ళాం
హరీష్ రావు ఎక్కడికి రమ్మంటావు 65 వేల కుటుంబల కు రుణమాఫీ చేసాం
జిల్లా అభివృద్ధి, రైతు రుణమాఫీ లో తెల్చుకుందామా ? ఎక్కడికి రమ్మంటావో చెప్పు హరీష్ రావు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రైతు నైన పరామర్శించారా ?
డబ్బుల సంచుల సంస్కృతి మాది కాదు మీ మామ కెసిఆర్ ది హరీష్ రావు హరీష్ రావు 70 యం . యం ఎం చూపిస్తావా ?
ధర్మపురి లో పూజలు, యాగాలు చేసినవు కెసిఆర్ ₹ 500 కోట్లు కేటాయిస్తాను అని అన్నారు. ధర్మపురి క్షేత్ర అభివృద్ధి కి ఏం చేశారు చెప్పాలని డిమాండ్ చేశారు.