హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం గోదావరి జలాలు !

J.SURENDER KUMAR,


తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి సంబంధించి సమగ్రమైన నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులను ఆదేశించారు. ఇందుకు వచ్చే నెల 1 వ తేదీ వరకు టెండర్ల ప్రక్రియకు కార్యాచరణను రూపొందించాలని అన్నారు.


👉 జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలింపు అంశంపై జూబ్లీహిల్స్ నివాసంలో శనివారం ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ, జలమండలి అధికారుల సమావేశంలో సమీక్షించారు.


👉హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపు ప్రణాళికలపై నివేదిక తయారు చేయాలని సూచించారు. నీటి లభ్యత, ఏ ప్రాజెక్టు నుంచి ఎంతమేరకు నీటిని తరలించాలి, ఎంత ఖర్చవుతుందన్న విషయాలపై పూర్తి అధ్యయనం జరగాలని ఆదేశించారు.


👉ఈ విషయంలో మిషన్ భగీరథ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.