👉వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా..
J.SURENDER KUMAR,
జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యం లో డయాబెటిస్ అవగాహన కార్యక్రమం పుస్తకాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో ఉచిత డయాబెటిస్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, వ్యాయామం యోగ, నడక తదితర జీవన విధానంలో మార్పులతో డయాబెటిస్ ను నియంత్రించవచ్చు అన్నారు.

ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షులు డా.హేమంత్, ప్రధాన కార్యదర్శి డా. ఆకుతోటా శ్రీనివాస్, ట్రెజరర్ సుధీర్ కుమార్, డా.రాజేశ్వర్ రావు, డా.చక్రధర్, డా.శ్రీధర్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.