👉డిసెంబర్ 1 వరకు నెలరోజుల పాటు !
👉ప్రతిరోజు గోదావరి నదికి హారతి !
J.SURENDER KUMAR,
ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నదికి శనివారం నుంచి నెలరోజుల పాటు సాయంత్రం హారతి కార్యక్రమం ప్రారంభం కానున్నది.
కార్తీక పర్వ మాసం పురస్కరించుకుని 02-11-2024 శనివారం నుండి 01-12-2024 వరకు గోదావరి నదికి హారతి కార్యక్రమం ప్రతి నిత్యం సాయంత్రం కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుండి సాయంత్రం మేళతాళాలతో అత్యంత వైభవంగా మహిళలు గ్రామస్థులు , సేవా సంస్థలచే గోదావరి నదికి ఊరేగింపుగా వెళ్లి గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హారతి నిర్వహించనున్నారు.
👉బ్రహ్మ పుష్కరిణిలో..

తేది 15-11-2024 శుక్రవారం బ్రహ్మ పుష్కరిణిలో (కోనేరులో) పంచసహస్రదీపాలంకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
👉 ఆలయంలో లక్ష్మీ పూజలు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లోని అద్దాలమండపంలో శ్రీ లక్ష్మి పూజ కార్యక్రమాలు లక్ష్మీసూక్తంతో , పురుషసూక్తంతో అత్యంత వైభవంగా అర్చకులు వేద పండితులు ఘనంగా నిర్వహించారు.

ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ప్రదాన దేవాలయం లో గల అభిషేకం మండపంలొ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు.

కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సంగి సత్తెమ్మ , సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాస్, అర్చకులు నంభి నరసింహ మూర్తి , చక్రపాణి కిరణ్ కుమార్ , అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ మరియు భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు .

