👉జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో..
J.SURENDER KUMAR,
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కరువు అయినా పేద ప్రజలకు అందించడానికి కోసమే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం చేపట్టిందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పైన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శాసన ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
రాష్ట్రంలో ఎంత మంది పేదవారు ఉన్నారు ? అర్హులైన ఎంత మంది పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి ? , తదితర అంశాలపై స్పష్టమైన సమాచారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టిందన్నారు. సర్వే ఈ నెల 6వ తేది నుండి ప్రారంభంకావడం జరుగుతుందని,

అధికారులె నేరుగా ఇంటి ఇంటికి వచ్చి ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలను సేకరించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించి ఖచ్చితమైన వివరాలను ఇవ్వాలని, వారు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ పేదవారికి, అట్టడుగువర్గాల వారికి అండగా ఉంటుందన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా మనం కష్టపడాలని, ప్రతి కార్యకర్త కష్టసుఖాలో వారికి తోడుగా మేము ఉంటామని వారు పేర్కొన్నారు..

అనంతరం రాష్ట్రంలో విద్యార్థులకు కాస్మొటిక్ మరియు మెస్ చార్జీలు పెంచిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.