టిటిడి ట్రస్ట్‌ల కు 2.2 కోట్ల విరాళం !

J.SURENDER KUMAR,


తిరుమల తిరుపతి దేవస్థానం కు చెన్నైకి చెందిన  వర్ధమాన్ జైన్ అనే భక్తుడు శనివారం టిటిడి ఎస్‌వి ప్రసాదం ట్రస్ట్ మరియు ఎస్‌వి అన్నప్రసాదం ట్రస్ట్‌లకు ఒక్కొక్కటి  ₹ 1.01 కోట్లు విరాళంగా అందజేశారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యా.శ్రీశాఖ తీర్థ స్వామీజీ సమక్షంలో దాత డీడీలను టీటీడీ అడిషనల్ ఈవో  సిహెచ్ వెంకయ్యచౌదరికి అందజేశారు.